*దొంగల భరతం.. తప్పు చేస్తే కటకటాలే…
*గంజాయి.. దోపిడీలపై నిఘా పెట్టిన డీఎస్పీ బృందం..
*కేసుల మిస్టరీ చేధించడంలో ‘‘మైదుకూరు పోలీసు’’ పక్కా వ్యూహం.
– నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
నేరాలు జరగకుండా చూడటంలో, నేరస్థులకు శిక్షలు విధించడంలో మైదుకూరు పోలీసులు కీలక పాత్రపోషిస్తున్నారు.. ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత మేలు… నేర నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడటం వంటివి మరింత సులభతరమవుతుందనే ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తోంది డీఎస్పీ వంశీధర్ గౌడ్ పోలీసు బృందం.. మైదుకూరు ప్రాంతంలో నేర పరిశోధనలో మనపోలీసు సామర్థ్యంకు జిల్లా స్ధాయిలోనే కాదు.. రాష్ట్రస్ధాయిలో ఒక గుర్తింపు విచ్చేస్తోంది. కేసుల దర్యాప్తులో మన మైదుకూరు డివిజన్ పోలీస్ శాఖ .జిల్లాలోనే మొదటి స్థానంకి ఎగబాకింది.

మైదుకూరు డివిజన్ లోని మైదుకూరు అర్బన్,రూరల్,ఖాజీపేట, దువ్వూరు, చాపాడు, బి.మఠం ప్రాంత భద్రత విషయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కారిడార్లో నిఘాను మరింత పెంచుకుంటూ.. అసాంఘీక కార్యకలాపాలపై ఆ యంత్రాంగం డేగ కన్ను వేసింది. బెట్టింగ్, జూదంలపై
కోళ్ల పందాలు, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా వంటి వాటిని పూర్తిగా నియంత్రించేందుకు కసరత్తు చేపట్టారు.. ఇంటి దొంగల కోసం అన్వేషణ చేపట్టారు.. హత్య.. దోపిడీ తదితర మిస్టరీ కేసులు చేధించడంలో అగ్రస్ధానంలో నిలిచి జిల్లాపోలీసు యంత్రాంగం ప్రశంసలు అందుకుంటోందనడానికి గంజాయి, దొంగతనాలు, దొంగనోట్లు తదితర కేసుల్లో పురోగతి సాధించడమే… .
‘‘మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో స్ఫూర్తిదాయకమైన సేవలందించి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తున్నారు.. రాష్ట్రంలో జిల్లా ప్రత్యేక స్థానంలో నిలుస్తున్నదంటే మైదుకూరు పోలీసు యంత్రాంగం కృషి ఉంది.. మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించి రాష్ట్రంలోనే మైదుకూరు సబ్ డివిజన్ మరింత పేరు ప్రఖ్యాతలుసాధించాలి. మైదుకూరు నందు కంట్రోల్ వ్యవస్థ ద్వారా నేరాల నిరోధానికి పోలీసు చేస్తున్న కృషి ప్రశంసనీయమని..మంచి ఫలితాలు సాధిస్తున్నారంటూ’’ జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ప్రశంసించేవారు. మైదుకూరు ప్రాంతంలో గంజాయి, దోపిడి దొంగలు, దొంగనోట్లు తదితర కేసుల మిస్టరీ చేధించిన క్రమంలో తరచూ మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, రూరల్ సీఐ నరేంద్రరెడ్డి, అర్భన్ సీఐ చలపతి, ఎస్ఐలు కుళ్లాయిప్ప, రాఘవరెడ్డి, విద్యాసాగర్, రాజు తదితరులు ఎస్పీ నుండి అభినందనలు అందుకునే వారు..



పట్టుబడిన అంతర్ రాష్ట్రదొంగలు…
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 చోరీ ఘటనల్లో పాల్గొన్న అంతరాష్ట్ర దొంగలు ఖాజీపేటలో పట్టుబడ్డారు.. కడప జిల్లాలో వై.ఎస్.ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో రెండు, తెలంగాణ లో 4 కేసుల్లో వీరికి భాగస్వామ్యం.. అలాంటి కరుడు కట్టిన దొంగలు మైదుకూరు రూరల్ సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ కుళ్లాయప్పలకు దొరికిపోయారు.. దొంగతనాల ద్వారా దోచుకున్న రూ. 10.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగతనాలకు వినియోగించిన రెండు కార్ల స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపించారు. అలాగే, మైదుకూరు,చ ఖాజీపేట, దువ్వూరు, బి.మఠం ప్రాంతంలో రాత్రిళ్లు, పగలు ఇంట్లో ఎవ్వరి లేనప్పుడు దోపిడికి పాల్పడే ఘరానా దొంగలు డీఎస్పీ పోలీసు బృందంకు దొరికిపోయింది.. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఇద్దరు కరడు గట్టిన అంతర్ రాష్ట్ర దొంగలను తమదైన శైలిలో విచారిస్తే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 73 ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. అంతే కాదు 16 కేసులలో శిక్ష అనుభవించి,9 కేసులలో వివిధ కోర్టులలో విచారణలను ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణైంది.ఈ కరుడు కట్టిన దొంగల నుండి రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 20 వేల నగదు దొరికింది. కరుడుగట్టిన దొంగల మిస్టరీని మనపోలీసు అధికారులు చేధించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకున్నారు.
గంజాయి పై డీఎస్పీ పోలీసు బృందం పంజా..
గంజాయిపై డీఎస్పీ బృంద పోలీసు అధికారులు, సిబ్బంది పంజా విసురుతున్నారు. మైదుకూరుప్రాంతంలో ‘మత్తుసను కూకటివేళ్లతో పెకలించే చర్యలు వేగవంతం చేశారు. గత కొన్ని నెలలుగా మైదుకూరు రూరల్ ప్రాంతంలో జరిగే గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి…
ప్రతిరోజూ గంజాయి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విక్రేతలను గుర్తించి కఠినంగా
శిక్షిస్తున్నారు. గంజాయి రవాణా, అమ్మకాలు గుర్తించి ముప్పేట దాడి చేస్తున్నారు. మన ప్రాంతంలో గంజాయి ఆనవాళ్లు కనిపించకుండా ఉండేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు మన పోలీసు అధికారులు. మూడు దశల్లో గంజాయి మూలాలపై దెబ్బ వేస్తున్నారు. మొదటి దశలో ఏజెన్సీ ప్రాంతాల నుండి ఇక్కడికి రవాణా.. రాజమండ్రి ప్రాంతాల నుంచి మైదుకూరుకు గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. ఇంతకు ముందున్న పాత కేసులు, అమ్మకందారుల నుంచి వచ్చిన సమాచారం, పోలీస్ నిఘాతో దువ్వూరు మండలంలోని గుడి పాడు గ్రామ సమీపంలో గంజాయి స్మగ్లింగ్చేస్తున్న అయిదుగురిని పట్టుకున్నారు. వీరి నుండి 40 లక్షల విలువ గల 30 కేజీల గంజాయి, 3 కార్లు ను రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి, ఎస్ఐ రాఘవరెడ్డిలు , ప్రత్యేక పోలీసు బృందం స్వాధీనం చేసుకుంది. రెండో దశలో సరఫరా దారుల నుంచి తీసుకొని వచ్చి, చిన్న చిన్న పొట్లాల కింద చేసి విక్రయించే డ్రగ్
పెడలర్స్)ను జల్లెడ పట్టి వారి భరతం పట్టే పక్కా వ్యూహంతో పోలీసులు నిఘా పెట్టారు.
నకిలీ నోట్ల చలామణి, దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు..
తెల్లారేసరికి కోటీశ్వరులు కావాలన్న దురుద్దేశ్యంతో…తక్కువ సమయంలో కోట్లు గడించాలనే ఉద్దేశ్యంతో అడ్డదారులు తొక్కారు.. దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును ఛేదించారు మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, సిఐ నరేంద్ర రెడ్డి, ఎస్ఐ రాఘవరెడ్డిలు దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన యేసయ్య, గంగవరపు సాగర్ రెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ కు చెందిన యంగనం పల్లె కోటేశ్వరరావు లు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. అంతటితో ఆగకుండా నకలీ నోట్ల వ్యవహారం కూపీ లాగారు.. అనంతపురం, కడప జిల్లా, ప్రొద్దుటూరు లో బెంగుళూరు లోదొరికిన పేక్ నోట్లు మూడు నాలుగు కోట్లగుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తరుణంలో మైదుకూరు పోలీసు యంత్రాంగం బట్టబయలు చేసింది. ఇక్కడి పోలీసు యంత్రాంగం నిఘా కళ్లతో.దొంగనోట్ల ముఠా కూపి లాగితే బెంగళూరు, అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతంలో ఈ దొంగ నోట్ల చెలామణి వెలుగులోకి వచ్చింది. మొత్తానికైతే దువ్వూరులో పట్టుబడిన నకిలీ నోట్ల చెలామణి వ్యవహారం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి వ్యవహారం నిగ్గులేల్చిన ఈ పోలీసు అధికారులిద్దరికి రాష్ట్రస్ధాయిలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయి.. దీని బట్టి డీఎస్పీ వంశీధర్ గౌడ్ బృందం ‘‘ పక్కా వ్యూహంతో- ప్రత్యేక ఆపరేషన్’’ తో మైదుకూరు ప్రాంతంపై డేగ కన్ను వేశారని చెప్పవచ్చు.. మైదుకూరు డీఎస్పీ వంశీగౌడ్ బృంద నిఘా నేత్రం కింద మైదుకూరు,రూరల్ ప్రాంతం గాఢ నిద్రలో ఉండిపోయింది. పల్లెప్రాంతాలు ప్రశాంతతను సంతరింప చేసుకుంటున్నాయి..
మట్కా.. జూదం పూర్తి స్ధాయిలో అరికట్టాల్సిన ఆవశ్యకత…
మనప్రాంతంలో జరిగే హత్యలు,అక్రమ వ్యాపారాలు, దోపిడి దొంగతనాలు కట్టడి చేసే క్రమంలో గానీ, వాటిని చేధించే దిశలోనూ మైదుకూరు పోలీసు అధికారులు విధానాలకు అమలు పరుస్తున్న వ్యూహం తరహాలోనే మట్కా, జూదంను పూర్తి స్ధాయిలో నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.