వైఎస్ జగన్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’.. “మా నమ్మకం నువ్వే జగన్ ’’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్ ప్రతి ఇంటికి వేసే కార్యక్రమం మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో జోరుగా సాగుతోంది.. గృహ సారథులు, వాలంటీర్ల సమన్వయంతో లబ్దిదారుల ఇళ్లను గుర్తించి స్టిక్కర్ కార్యక్రమంను ఎమ్మెల్యేరఘురామిరెడ్డితోపాటు, పార్టీ శ్రేణులు భుజస్కందాలపై వేసుకున్నారు..ప్రతి గడపకు జగన్ స్టిక్కర్ ఉండేవిధంగా ప్రణాళికఅమలు చేస్తున్నారు..
గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు వీరంతా అనుసంధానం చేసుకుంటూ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లను గుర్తిస్తారు. వాటిని గుర్తించి స్టిక్కర్ అతికిస్తారు. 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు ఉంటారు. వారు ఆయా ఇళ్లకు వెళ్తారు. ఇంటి యజమాని అనుమతి తీసుకున్న తర్వాతే ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న స్టిక్కర్ ను అతికిస్తారు. దీనికి సంబంధించిన కార్యక్రమం గత మూడు రోజులుగా మైదుకూరు సెగ్మెంట్ లో సాగుతోంది.. దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమమంటూ వైసీపీ నాయకత్వం భావిస్తోంది.. ఎంపిక చేసిన పార్టీ సైన్యంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరించేపనిలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉండిపోయారు.. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఆదేశాలను తూచతప్పకుండా పాటించే ప్రణాళిక చేపడుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంను తనకు అనుకూలంగా మలుచుకునే విషయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. వైసీపీ భుజానికి సంచి, చేతిలో స్టిక్కర్లతో నాయకులు దీనిని ఓ ఉద్యమంలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు..
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహిస్తూనే ప్రతీ ఇంటికి జగన్ స్టిక్కర్ ఉండేలా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తోపాటు వైసీపీ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో అధికార పదవులు నిర్వహిస్తున్న నాయకులు చూడగలుగుతున్నారు.. ఈ స్టిక్కర్ అంటించే క్రమంలో ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ది గురించి ప్రతీ ఇంటికి వివరించడంలో ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారు.. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పరంగా ఎంత మేర ప్రయోజనం కలిగిందీ వివరించి చెబుతున్నారు. అదే సమయంలో పథకాలు అందన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకం అందిస్తామని చెప్పుకొస్తున్నారు.. ఇదే సమయంలో పథకాలు అందుతున్న ప్రతీ ఇంటికి”మా నమ్మకం నువ్వే జగన్”స్టిక్కర్లు అతికించి మరో ఇంటికి వెళ్తున్నారు..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని, ఆ సంస్కరణల ఫలాలను సమీక్షించి.. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు ఆ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మీడియా సమావేశాలుపెట్టి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వివరించే ప్రణాళిక చేపడుతున్నారు.. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నారు..ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ చేయని భారీ కార్యక్రమం ఇదని వైసీపీ నేతలు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు…
భూజానికి వైసీపీ సంచితో.. చేతిలో స్టిక్కర్ తో..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి.. వైసీపీ నాయకుడు.. పైగా రాష్ట్ర ఖనిజాభివృధ్ది డైరెక్టర్.. రాష్ట్రపదవిలో కొనసాగుతున్నారు.. జగనన్నే మా భవిష్యత్తు’’.. “మా నమ్మకం నువ్వే జగన్ ’’ స్టిక్కర్ అంటించే కార్యక్రమం వైౌసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. జగన్ ఆదేశాసుసారం వాలంటీర్ తరహాలో స్టిక్కర్స్ అంటించే కార్యక్రమంను తన భుజస్కందాలపై వేసుకున్నాడు.. మండలంలో పార్టీ క్యాడర్ కు ఒక వైపు చూసిస్తూ..మరో వైపు తాను రాష్ట్రపదవి హోదాలో ఉన్న సామాజిక స్పహా వదిలి.. ఓ గృహసారధిలాగా తన భుజంకు వైసీపీ సంచి తగిలించుకుని.. చేతిలో స్టిక్కర్ తో ప్రతిగడప ను ఎక్కారు.. వారి అనుమతి తీసుకుని స్టిక్కర్ను తగిలిస్తూ ప్రభుత్వపథకాలను, ఆ కుటుంబంకు చేకూరిన లబ్ది ని వివరిస్తూ మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రజలచే అన్నించేలా కార్యక్రమంను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి.. వైసీపీ భుజానికి సంచి, చేతిలో స్టిక్కర్లతో కన్పించిన పెద్ద నాయకుల్లో ఈ మూడు రోజుల కార్యక్రమంలో వీరే ప్రధముడు అనేమాట కూడా వినపడుతోంది..