2007-2012 మధ్యకాలంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం వీరిది.. నిధుల దుర్వినియోగంపై కానీ, ఆక్రమణలు తదితర విషయంలో పోరాటంలో వెనకడుగు వేయని మనస్థత్వం వీరిది.. రాజకీయ ఒత్తిడులను ఏమాత్రం ఖాతరు చేయని స్వభావం.. తను పట్టుకున్నాడా? వదలడు.. చివరకు అక్రమాలకు, అవినీతికి పాల్పడిన అధికారులైన, నాయకులైన జైలుకుపంపడంలో.. అలాగే ఆక్రమణల వ్యవహారంలో సైతం అదేధోరణి.. అలా అన్ని అన్ని వ్యవహరాల్లో తలదూర్చరు.. న్యాయబద్దంగా, తన ప్రాంతపరిధిలోని విషయాలపై ఒరవడి కొనసాగిస్తారు.. నెగ్గుకొస్తారు.. వీరే చొక్కంరమేష్.. మైదుకూరు పురపాలిక ఏర్పడక ముందు ఆపరిధిలోని లింగాలదిన్నెకు ఏకగ్రీవ సర్పంచ్..
-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
డీఎల్ రవీంద్రారెడ్డితో కలసి నిధుల దుర్వినయోగంపై మొదటి అడుగు..
2014 నుండి 2018 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైదుకూరు పురపాలిక పరిధిలోని లింగాలదిన్నెప్రాంతంలో వివిధ అభివృద్ధిపనులు చేపట్టారు.. ఈ అభివృద్ధి పనుల్లో గోల్ మాల్ జరిగిందని.. వేయని రోడ్డును వేసినట్లు. పాతరోడ్లు చూసి లక్షల నిధులు కాజేసిన వ్యవహారంను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలసి బట్టబయలు చేశారు మాజీ సర్పంచ్ చొక్కం రమేష్.. అంతటితో ఆగలేదు.. ఈ అవినీతిలో భాగస్వామ్యులైన పురపాలిక అధికారులతోపాటు, నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు నిమిత్తం అధికారులకు ఫిర్యాదులుచేశారు.. స్పందన లేదు.. ఈ నిధుల స్వాహాపై విజిలెన్స్ విచారణ చేపట్టాలంటూ జిల్లా కోర్టును ఆశ్రయించారు రమేష్.. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ శాఖను జిల్లా కోర్టు ఆదేశించింది.. నిధుల దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ నిర్ధారించి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంకు నివేదిక ఇచ్చింది.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చర్యలు అటకెక్కాయి..
వైసీపీ ప్రభుత్వ ఏర్పడగానే మళ్లీ పోరాట పంథా..!
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ రిపోర్టు ఇచ్చినప్పటికీ నిధులు రికవరీతోపాటు.. అధికారులపై చర్యలను కోరుతూ చొక్కం రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.. నిధుల దుర్వినియోగం కు పాల్పడిన అధికారులతోపాటు, కాంటాక్టులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు వైసీపీ ప్రభుత్వంకు సూచించింది.. తెలుగుదేశం ప్రభుత్వ తరహాలనే.. వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా చర్యలు విషయంలో జాప్యం కొనసాగుతూ వచ్చింది.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ మళ్లీ హైకోర్టుల కంటెంట్ వేశారు చొక్కం రమేష్..
జైలుకు వెళ్లిన అధికారులు, కాంటాక్టర్లు..
నిధుల దుర్వినియోగంకు పాల్పడిన అధికారులపై, కాంటాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కదిలిక వచ్చింది.. గతంలో కమీషనర్ గాపని చేసిన కేవీ క్రిష్ణారెడ్డి, జీ.శ్రీనివాసులు, కమీషనర్ ఇన్చార్జ్ గా వ్యహరించిన ఏఈ శ్రీనివాసులతోపాటు, డీఈ విశ్వనాధ్ , కాంటాక్టర్లు ముజాఫర్, ఫిరోజ్ ఖాన్, విద్యాసాగర్ లపై కేసులు నమోదు కావడం .. ఇందులో కమీషనర్ కేవీ క్రిష్ణారెడ్డి, డీఈ విశ్వనాధ్ లు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ హైకోర్టునుండి పొందగా.. మిగిలిన వారంతా జైలుకు వెళ్లారు.. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే అధికారులపై , కాంటాక్టర్లపై కేసు నమోదు కావడం జరిగింది కానీ, చార్జ్ షీట్ లో మాత్రం ఏడాది అవుతున్న కదలిక లేదనే విమర్శ ఉంది. ఏదిఏమైనా 2018 నుండి అయిదేళ్లు పోరాటం చేసి.. అందులో ఎక్కడ వెనకడుగు వేయకుండా నిధుల దుర్వినియోగంపై పోరాటం చేసి అందరిచే శహాబాష్ అన్పించుకున్నారు మాజీ సర్పంచ్ చొక్కంరమేష్..
మైదుకూరులోని అనధికారలేఅవుట్పై అధికారుల్లో స్పందన.. ]
మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో తొమ్మిదవ సచివాలయం పరిధిలోని విజయనగర్ కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 104 యజమాని శీలం బుట్టగాండ్లనాగన్న ఫ్లాట్ ద్వారా రాకపోకలు అనధికారికంగా ఏర్పాటు చేసుకుని కొందరు వ్యక్తులు ఈ ప్లాట్ నెంబరు 104 వెనుక భాగమున సుమారు రెండు ఎకరములలో ఇప్పటికే అనధికారంగా ఫ్లాట్స్ లు, గ్రావెల్ రోడ్డు వేసి ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ మాజీ సర్పంచ్ చొక్కంరమేష్ పురపాలిక అధికారులకు ఫిర్యాదు చేశారు.. చొక్కంరమేష్ ఫిర్యాదుతో అధికారుల్లో అలజడి మొదలైంది.. చొక్కం రమేష్ ఫిర్యాదుపై స్పందించిన ప పురపాలిక అధికారులు ప్లాట్ నెంబరు 104 గుండా పోవు వెనుక భాగంన పొలంలో వేసినట్లు వంటి అనధికార లేఅవుట్లు మరియు అనధికార రోడ్ల ను తొలగించారు.. మూడు రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని చొక్కం రమేష్ అంటున్నారు.