మైదుకూరు ఏర్పడి అర్ధశతాబ్దం దాటింది. ఒక రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి ఆనాటి పరిపాలనకులు, వివిధ వ్యవస్థల్లో ఉన్న ప్రాంతాలను కలపి ఏకీకరణ చేసి 1955లో నియోజకవర్గంగా రూపొందిచారు.. మరసటి ఏడాది (1956)న మైదుకూరులో సాయినాథపురం అవతరించింది.. నేటికి 75ఏళ్లు పూర్తిచేసుకుంది.. ఇపుడు మైదుకూరు పురపాలిక రాజకీయంలో సాయినాధపురంది సింహాభాగం.. ఆచరిత్రకు తగ్గట్టు సాయినాధపురం అభివృద్ధిలోనూ అదే భాగం దక్కాల్సిన ఆవశ్యకత ఉండిపోయింది..
– నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
సాయినాధపురం ఇలా ఏర్పడింది…
మైదుకూరులోని షిరిడిసాయిబాబా మొదటి (పాత)మందిరం 1956వ సం||న వెలసింది. ఈ సాయిబాబా మందిరం నిర్మాణంతోనే మైదుకూరులోని సాయినాథపురం అవతరించింది. స్థానిక కడప రోడ్డులోని జిల్లాపరిషత్ హైస్కూల్ హద్దుగా కడప దిశగా సాయినాథపురం విస్తరించి ఉంది.హద్దుగా కిడిపి దిశగా నాయన విస్తరించి ఉంది. ఈ సాయిబాబా మందిర నిర్మాణం వెనుక శ్రీయోగానంద కృష్ణారావు అనే భక్తుడి
కృషి ఎంతగానో ఉంది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన కృష్ణారావు చిన్న తనంలోనే తన అన్నగారికి దండనతో ఇల్లువిడిచి వచ్చి కడప చేరాడు. కడపలోని వస్టవులో ప్రముఖంగా విలసిల్లిన ‘మణిస హోటల్ లో కృష్ణా రావు పనిచేస్తూ ఉండేవారు.
మణిహోటల్ యజమానికి బంధులైన మైదుకూరుకు చెందిన మైదుకూరులో నరసింహయ్య హోటల్ నడిపేవారు. కృష్ణారావు మైదుకూరికి వచ్చి నరసింహయ్య హోటల్ క్యాషియర్ గా పనిచేస్తూ, ఆధ్యాత్మిక భావనను కూడా పెంపొందించు కున్నారు. మూడు సార్లు షిరిడీకి వెళ్ళి వచ్చారు. షిరిడీలో అబ్దుల్లా బాబా కృపకు పాత్రుడయ్యాడు. అబ్దుల్లా బాబా కృష్ణారావును చేరదీశాడు.
“మైదుకూరులోని ఈశాన్యభాగంలో వెలసిన ఆశ్రమంలోని స్త్రీ గురువు వద్ద శిష్యరికం పొందుము అని “అబ్దుల్లా బాబా ” కృష్ణారావుకు సూచించారు. కార్యక్రమాల్లో పాల్గొంటూనే కృష్ణారావు మైదుకూరులో 1956 సంవత్సరం హోటల్ నరసింహయ్య ప్రోత్సాహంతో సాయిబాబా గుడి నిర్మాణం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో సాయిబాబా గుడి నిర్మాణం పూర్తి అయింది. సాయినాధుని గుడి కారణంగానే ఆ గుడి వెలసిన పురానికి “సాయినాథపురం “అని పేరు వచ్చింది.
మైదుకూరు పురపాలికలో సింహాభాగం..
మైదుకూరులోని కడపరోడ్డు ప్రాంతంలో సాయినాధపురం.. ఆర్టీసీ బస్టాండు నుండి కడప వైపు కొత్త సాయిబాబా మందిరం వరకు విస్తరించి ఉంది..మైదుకూరు పురపాలికలో నేడు కీలకంగా ఉండిపోయింది. సాయినాధపురం నందు 8,9,11,12 వార్డులతోపాటు 13 వార్డులో కొంత భాగం ఉండిపోయాయి. మైదుకూరు పురపాలికలో నేడు సాయినాధపురం రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తోంది.. ఛైర్మన్ గిరితోపాటు, వైస్ ఛైర్మన్ల పదవులు, కో ఆష్షన్ పదవి సాయినాధపురమే దక్కించుకుంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు సాయినాధపురం నుండి ఛైర్మన్ పదవికి పోటీ చేయించాయంటే.. సాయినాథపురం ప్రజల పట్ల ఆరెండు పార్టీలకున్న విశ్వాసం అలాంటింది..
పురపాలికలో 24 వార్డు కౌన్సిలర్ స్ధానాలుండగా.. సాయినాథపురంలో ఉండే కౌన్సిలర్ స్ధానాలు నాలుగన్నరే.. సంఖ్యా పరంగా తక్కువైనప్పటికీ ముగ్గరు కౌన్సిలర్లు అందులో .. ఛైర్మన్ మాచునూరు చంద్ర, రెండు వైస్ ఛైర్మన్లు మూలే రేణుకాదేవి, మహబూబ్ షరీప్( చేపల షరీప్) పదవులు దక్కుంచుకోవడమే కాదు.. సాయినాథపురంకు చెందిన ఎంఆర్పీ దండు వెంకటసుబ్బయ్య కూడా కో ఆష్షన్ కౌన్సిలర్ పదవి పొందగలిగారంటే.. రాజకీయంగా కూడా ఘనమైన పాత్ర సాయినాధపురం దంటూ ఘంటాపథంగా చెప్పవచ్చు..
నాలుగున్నరలో నలుగురు కౌన్సిలర్లు మాచునూరు చంద్ర, మూలే రేణుకాదేవి, చేపల షరీఫ్, పిల్లి ఇందిరారమణి వైసీపీ పార్టీకి చెందిన వారైతే.. తెలుగుదేశం పార్టీ పక్షాన పాశం వెంకటసుబ్బమ్మ ( అరభాగం) కౌన్సిలర్లుగా వ్యవహరిస్తున్నారు.. పురపాలికలో సింహాభాగ స్ధానం కల్పించిన సాయినాథపురం ప్రజలు అదే తరహాలో గణనీయమైన అభివృద్దిని ఆశిస్తున్నారు..
ఈపుర ప్రజలు అందించిన ఆదరణ వల్లనే మాకు పదవుల విషయంలో సార్థకత లభించిందని… ముగ్గరు ప్రజానేతలు గుర్తెరిగి సాయినాథపురంకు చరిత్రకు తగ్గట్టు అభివృద్ధి పథ పలాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇప్పటికే రెండేళ్ల కాలం గడిచిపోయింది.. ఇక మిగిలింది మూడు ఏళ్ల ముచ్చటే.. తమకు పదవులు అలంకరించి పెట్టిన సాయినాథపురం ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ప్రగతి పథంలో నడిపిస్తారో లేదే.. వేచి చూడాల్సి ఉంది.
సాయినాథపురంలోని అయిదురోడ్ల కూడలిలో వేమన్న ఇలా..
మైదుకూరులోని అత్యధిక రోడ్ల కూడలి కల్గిన ప్రాంతం సాయినాథపురమే అని చెప్పవచ్చు.. మైదుకూరుకు ప్రధాన కూడలి నాలుగు రోడ్లు అయితే.. ఇక్కడ అయిదు రోడ్లు కూడలి సముదాయం ఉంది.. అయిదురోడ్ల కూడలిగా రూపుదిద్దుకున్న ఈ ప్రాంతంలో యోగివేమన విగ్రహం ఇలా దిక్కుమొక్కులేకుండా పడివున్నాడు.. నాలుగు రోడ్ల కూడలిలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహం, బద్వేల్ రోడ్డులో మార్కెట్కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాయినాథపురం అయిదురోడ్ల కూడలిలో రైతు ఉద్యమకారుడు కీ.శే ఎంజే సుబ్బరామిరెడ్డి, బీజేపీనాయకులు రాజమోహన్రెడ్డి, అచలమతం ప్రతినిధులు కలసి పదేళ్లకిందట రాత్రిరాత్రికి యోగి వేమారెడ్డి విగ్రహంను నెలకొల్పారు.
ఈ సెంటర్కు యోగివేమన సెంటర్ గా పేరు నామకరణం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్.. పదేళ్లు గడిచిపోయింది.. ఇప్పుడు యోగి వేమన ఇలా దిక్కు మొక్కు లేకుండా మొండి భైరవుడి తరహాలో ఉండిపోయాడు…వేమారెడ్డి కులానికి చెందిన నేతలే ఈ పదేళ్ల కాలం అధికారంలో ఉంటుండి కూడా.. వేమన వైపు కన్నెత్తి చూడలేదు.. అసలు అక్కడ వేమన విగ్రహం ఉందన్న సంగతి కూడా ఆ నేతలకు తెలయని దుస్థితి.. ఏమి చేద్దాం మరి..అలా ఉంది మన పాలకుల పరిపాలన తీరు…