ఆవిష్కరించబడిన ‘‘మధుర ఘట్టం’’..
‘‘అట్టహాసం’’గా జాతీయ పతాక ఆవిష్కరణ…
పరవశించిన ‘‘పుట్టా సుధాకర్ యాదవ్’’
నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు…
మన ఆత్మగౌరవానికి ప్రతీక మన జాతీయ పతాకం… ‘‘జెండా వూంఛా రహే హమారా’’ అనే నినాదంతో మైదుకూరు నింగిలోకి ఎక్కి కూర్చుంది ‘‘జాతీయ పతాకం’’ .. నింగిలో ఎత్తుగా ఎగిరి రెపరెపలాడుతున్న ఈ పతాకమే మైదుకూరు ప్రజల స్వాభిమానానికి సంకేతంగా నిలుస్తోంది.. ఎవరెస్టు ఎక్కినా.. చంద్ర మండలంపై అడుగు పెట్టినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా.. ఇలా అత్యంత విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది ‘‘జాతీయ జెండాయే’’.. మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకం మైదుకూరు నింగిలో (101 అడుగుల ఎత్తులో ) రెపరెపలాడుతుంటే ఇక్కడి ప్రతి పౌరుడు స్వాభిమానానికి సంకేతంగా భావిస్తున్నాడు.. పైన రెపరెపలాడుతున్న పతాకాన్ని మెడలు వంచి పై పైకి చూస్తూ మురిసిపోయోంత మధుర ఘట్టం మైదుకూరులో కూడలిలో ఆవిష్కరించబడింది..
76వ గణతంత్ర దినోత్సవం.. ఈ దినోత్సం పురస్కరించుకుని నియోజకవర్గకేంద్రమైన మైదుకూరు కూడలిలో ‘‘101’’ అడుగుల ఎత్తులో రెండు టన్నుల బరువైన ఇనుప పోల్ పై 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో జాతీయ పతాకంను రమారమి 16 లక్షలు నిధులు వెచ్చించి నిర్మించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.. వంద అడుగుల జాతీయ చేత బట్టి.. వాయిధ్యాల నడుమ పతాకాన్ని ఆవిష్కరించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విద్యార్ధులు, పుర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. ఈ సందర్భం ఒక వేడుకగా మారింది.. పతాక ఆవిష్కరణ కార్యక్రమం పండుగను మరిపించింది.. వేలాదిగా తరిలి వచ్చిన జనసమూహం సమక్షంలో ఆదివారం ఉదయం 9.15 గంటలకు జాతీయపతాకాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు..మొట్ట మొదట మైదుకూరులో జరుగుతున్న ఈ జాతీయపతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, పట్టణ ప్రజలు తరలివచ్చి వీక్షించారు.. ఆ మధుర క్షణాలను వీక్షించి పరవశించి పులకించారు.. జాతీయ పతాకం నింగిలోకి దూసుకువెళ్తుంటే ఆనందడోలికలతో మునిగిపోయి.. చప్పట్లతో ప్రతిధ్వనించారు.. పతాకం నింగిలోకి వెళ్లి రెపరెపలాడగానే జాతీయ గీతం ఆలపించి జాతీయత పట్ల తమ భక్తి భావంను ప్రదర్శించారు.. ఆవిష్కరణ కార్యక్రమంకు విచ్చేసిన ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధి జాతీయ పతాకం చేత బట్టి నింగికేగిసిన పతాకంకు వందనంచేశారు. జాతీయ నాయకుల వేషధారణతో చిన్నారులు ఆవిష్కరణ కార్యక్రమంకు విచ్చేశారు.. చిన్నారుల వేషధారణ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను ఆకట్టుకుంది.. చిన్నారులను ఎమ్మెల్యే ప్రశంసించారు.. పతాక ఆవిష్కరణకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు, జనసేన పార్టీనియోజకవర్గ ఇన్ఛార్జ్ పండిట్ మల్హోత్ర, బిజేపీ ఇన్ఛార్జ్ మాచనూరు సుబ్బరాయుడుతోపాటు, పురపాలిక అధికారులు, పోలీసు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమంకు తరలివచ్చారు.. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మైదుకూరుచరిత్రలో ఒక అరుదైన ఘటనగా అభివర్ణించవచ్చు..
పతాక ఆవిష్కరణలో ఆనందంతో పులకించిన ‘‘ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్’’…
తనకు అధికారం కట్టబెట్టిన మైదుకూరుప్రజల హృదయాలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేసే క్రమంలో భాగంగా మైదుకూరు నడి బొడ్డున జాతీయ జెండా రూపకల్పనలో ప్రధాన భూమిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పోషించిన విషయం విదితమే.. ప్రజలందరిలో ఆత్మాభిమానం పెంపొందించే ప్రక్రియ చేపట్టాను అనే భావన కల్గి ఉన్నందువల్లనేమో.. ఎప్పుడు నిరాడంబరంగా కనపడే ఎమ్మెల్యే పుట్టా సుదాకర్ యాదవ్ ముఖం జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలో ముఖం ఆనందంతో నిండిపోయింది.. చిరునవ్వు వెల్లివిరిసింది.. జాతీయ జెండా నింగిలోకి వెళ్లి రెపరెపలాడటం చూసి కొద్ది సేపు ఆనందంతో మురిసిపోయారు.. పుెలకించిన మనసుతో నిండు కుండలా కార్యక్రమంలో కనపడ్డారు..
ఎమ్మెల్యే ఆనందం ఏ పాటిదో వారి మాటల్లో ..
‘‘ పురపాలిక లోె నిధులులేవు.. ఏదో సాధించాలనే తపన.. నన్ను ఎమ్మెల్యేను చేసి ఆరు నెలలు దాటింది.. మైదుకూరు ప్రజల హృదయాల్లోసుస్ధిరంగా నిలిచిపోవాలంటే పట్టణం అభివృద్ధి సాధించాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైదుకూరుకు వస్తేవారితో కారులో ఉన్నప్పుడు చెవిలో జోరీగా లాగా వివిధ అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి గట్టిగా అడిగా… ఇక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులకు నాలుగు లెటర్లుతయారు చేసి అందులో వివరించి అందించా.. ఎట్టకేలకు శాశ్విత పనులకు సంబంధించి నిధులు మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా మంజూరు చేయించుకున్నాను.. మైదుకూరు పట్టణంలో ప్రజల అభిమానం చూరగొనే శాశ్వితపనులు చేపట్టాలన తపన ఉంది.. అయితే పురపాలికలో నిధులు లేవు.. ఏమైనా సరే పనులు ముందు చేయించాలి అని గట్టిగా అనుకున్నా.. నాలుగు రోడ్ల సెంటర్లో శ్రీ కృష్ణదేవరాయులు విగ్రహంతో పాటు, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్రతిష్ట చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద జాతీయపతాకంను నిలబెట్టి, ప్రొద్దుటూరు, బద్వేల్ రో్డ్డులో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు విద్యుద్దీకరణ పనులు చేపట్టాలనే భావనతో నిధులు లేకున్నా ముందస్తు ప్రణాళిక చేపట్టాను.. నిధులు విషయం పక్కన బెట్టి అభివృద్ధి ముఖ్యం అనే భావనతో రెండు కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు ముందుకు రావాలిన మాపార్టీకి చెందిన కొందరిని కోరాను.. నిధులు ముఖ్యం కాదు.. మీ అభివృద్ధి ఆకాంక్షకు మేము తోడుంటాము అనే చిత్తశుద్దితో కొందరు ముందుకు వచ్చారు.. అందులో ముఖ్యంగా ఏపీ రవీంద్ర, దాసరి బాబు, వేపరాల చిన్న, కోన సుబ్బారావు.. వీరి ద్వారా డబ్బులు పెట్టించి ముందుగా ఈపనులు చేపట్టా.. ఒక ప్రణాళిక మేరకు రిపబ్లిక్ రోజు కు పూర్తి చేయాలన్నది నా దృఢ సంకల్పం.. ఆ సంకల్పం మేరకు ఈ నలుగరు పట్టుదలతో పనిచేశారు..అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తరుణంలో శ్రీకృష్ణ దేవరాయులు విగ్రహ ప్రతిష్టరోజు, విద్యుద్దీకరణ పనులు ప్రారంభించినరోజు.. జాతీయపతాకం మైదుకూరు నింగిలో రెపరెపలాడిన ఈ రోజు నాకు పెద్ద ఆనందం వచ్చింది.. ఈపనులు చూసి మురిసిపోయా.. నాలో నేను నవ్వుకున్న.. ఒక విధంగా అనుకున్న లక్ష్యమేరకు జాతీయ నాయకులు విగ్రహాలు, జాతీయ పతాకం, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయడంను చూసి గర్వంగా ఉంది.. అలాగే, మైదుకూరు పురపాలిక సరిహద్దుల స్వాగత బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నాను.. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ మీ రుణం తీర్చుకుంటున్నాను అనే తృప్తి నాకు పెద్ద ఆనందంను కల్గిస్తోంది… ఈ ఆనందం స్ధిరంగా ఉండే విధంగా నా ప్రణాళిక ఉంటుంది’’..