మైదుకూరు పురపాలిక పరిధిలోని శెట్టివారిపల్లెలో..
మానవీయకోణంలో స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
హత్య ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు..
పోలీసు శాఖాధికారుల్లో అనూహ్య స్పందన
నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు…
2024 డిశంబర్ 6.. సమయం అర్ధరాత్రి ఒంటిగంట.. నిర్మాణంలో ఉన్న భవనం.. ఆ భవనంలో ఖాళీగా ఉండే మంచంపై నిద్రిస్తున్న 75ఏళ్ల వృద్ధుడుపై ఇద్దరు యువకులు దాడి.. వృద్ధుడి తలపై దిండు మోపి ఊపిరి ఆడకుండా బలంగా నొక్కేస్తున్నారు.. కొద్ది సేపటికి ఆవృద్ధుడు ఊపిరాడకా కాళ్లు గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలారు.. వృద్ధుడి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న ఆ ఇద్దరు యువకులు అక్కడ నుండి చడీచప్పడు కాకుండా జారుకున్నారు.. పడుకున్న మంచంమీదనే శవమై ఉండిపోయాడు ఆవృద్ధుడు.. తెల్లారింది.. కొత్తగా కడుతున్న ఇంటికి నీరు పట్టేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.. ఇక్కడేంటి ఖాళీగా ఉన్న మంచంలో ఎవరో పడుకుని ఉన్నారు అనుకుంటూ అక్కడి వచ్చి పరిక్షించి చూశాడు.. ప్రాణాలు లేని వృద్ధ శవం.. వృద్ధుడు కదా మామూలు చావు చచ్చాడేమో అనుకుని బయటకు తీసుకువచ్చి అంగన్ వాడీ కేంద్రం వద్ద ఉంచాడు.. ఆ వృద్ధుడి బంధువులు అంత్యక్రియలు తతంగం పూర్తిచేశారు.. 75 ఏళ్లు కదా ఏదైనా అనారోగ్యం వల్ల చచ్చిపోయాడేమో అని ఆ పల్లె వాసులు అనుకున్నారు.. ఇదంతా మైదుకూరు పురపాలిక పరిధిలోని శెట్టివారిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది..
వృద్ధుడి మరణం బట్టబయలు చేసిన సీసీ కెమెరా..
కొత్త ఇల్లులు నిర్మించుకునే క్రమంలో ఆ ఇండ్ల యజమానులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) చావుకు సంబంధించి మిస్టరీ రికార్డైంది.. ఆ రికార్డు లో వృద్దుడి హత్య దృశ్యాలు ఆపల్లె వాసులను హడలెత్తించాయి.. నడి ఊరిలో.. ఇలా హత్యకు పాల్పడటంపై భయాందోళన చెందారు.. కానీ, ఎవ్వరికీ వారు మిన్నకుండిపోయారు.. వృద్దుడి అంత్యక్రియలు తర్వాత ఆపల్లెకు పోలీసులు వచ్చారు.. విచారణ జరిపారు.. ఎవ్వరీ నుండి పిర్యాదు లేని కారణమో? హత్యకు సంబంధించిన ఆధారం లేని కారణమో? వీరారెడ్డి హత్య మిస్టరీ అలా ఉండిపోయింది.. వీరారెడ్డిని చంపారు.. శెట్టివారిపల్లెలో .. నడి ఊరిలో హత్య జరగడం ను అందరూ తీవ్రంగా భావించారే కానీ, హత్య మిస్టరీ విషయం గుసగుసగా ఉండిపోయింది..వీరారెడ్డి మామూలు చావుగానే మిగిలిపోయింది.. ఆ పల్లె జనం సైతం ఆ వృద్ధుడి హత్య ఉదంతం గురించి మరిచిపోయారు..
మానవీయ కోణంలో స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..
25 రోజులు తర్వాత శెట్టివారిపల్లెలో వృద్ధుడు వీరారెడ్డి హత్య ఉదంతం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చెవికి చేరింది.. వృద్దుడి ప్రాణాలు పోవడం వెనుక మిస్టరీ ఏమిటీ?? ఒక వ్యక్తి హత్యకు గురైతే ఇలా వదిలేయడం ఏంటనే అనే కోణంలో తీవ్రంగా చలించాడు.. మానవత్వం మంటగలిచి పోవడం పట్ల ఒకింత ఆవేదనకు గురయ్యారు.. జనవరి ఒకటిన తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసిన పోలీసు ఉన్నతాధికారులతో శెట్టివారిపల్లెలో జరిగిన వృద్దుడు వీరారెడ్డి హత్య విషయంపై సీరియస్ అయ్యారు.. మనం ఎక్కడున్నాము? ఏమి జరుగుతోంది? అసలు మానవీయత ఉండాల్సిన బాధ్యత ముఖ్యంగా మీలో ఉండాలి కదా అంటూ పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించారు.. ఏదిఏమైనా వీరారెడ్డి వృద్దుడు హత్య మిస్టరీ చేధించి తీరాల్పిందే..ఇలాంటి ఘటనలు ఎక్కడ జరకూదడు అంటూ పోలీసుఅధికారులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఒక విధంగా ఆదేశాలు జారిచేసినట్లు ఉంది.. 24గంటల్లో వృద్దుడి హత్య మిస్టరీ తేల్చండి అంటూ మానవీయ కోణంలో ఎమ్మెల్యే స్పందించారు.. వృద్ధుడి హత్య ఉదంత వివరాలు డీఐజీకి ఎమ్మెల్యే తెలియజేశారు.. హత్య మిస్టరీని తేల్చండి.. నిజాలు బహిర్గతపర్చండి అంటూ పోలీసు ఉన్నతాధికారిని కోరారు..