డీఎల్ రవీంద్రారెడ్డి.. 2014 నుండి రాజకీయ పదవులకు దూరంగా ఉన్న వ్యక్తి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే కాదు.. వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు సంధించడంలో తగ్గేదేలేదన్నట్లు వ్యవహరిండం చూస్తున్నాము.. సాక్షాత్తు తమ అధినేత మీదనే కాదు.. ప్రభుత్వం మీద అవినీతి పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దలే కాదు.. ఇక్కడ నియోజకవర్గ పెద్దలు కూడా అదే దీటుగా ఢీ కొట్టలేని దుస్థితి ఉండిపోయిందనే మాట వింటున్నాము.. డీఎల్ కు దీటుగా విమర్శలను తిప్పికొట్టమని వైసీపీ అధిష్టానం ఆదేశించినా.. పది మందిని అదీ డీఎల్ సామాజిక వర్గం( పెడకంటి రెడ్లను ) అడ్డుపెట్టకొని అదీ కూడా ఉడుతా భక్తిగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాము..డీఎల్ అధికారంలో లేరు.. ఎమ్మెల్యే కూడా కాదు.. ఇలాంటి సందర్భంలోనూ కూడా అధికారపార్టీ పెద్దలది నోరు మెదపలేని పరిస్థితి..
అలాంటిది ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు.. కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయ పవర్ ఉన్న తరుణంలో కడప పార్లమెంట్ ఉప ఎన్నికలు (2011) లో డీఎల్ అదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పోటీకి దిగినప్పుడు డీఎల్ పవర్ ఎలా ఉంటుందో అందరం చవిచూసింటాము .. అందరం వినే ఉంటాము.. అలాంటి సందర్భంలోనూ డీఎల్ మీద వార్తలు ఇవ్వలేక భయభ్రాంతులకు గురై కొందరు సాక్షి పత్రికలో పనిచేయడం మానుకున్నారు.. ఓ సామాన్య వ్యక్తిని.. ఇద్దరి ఆడపిల్లల తండ్రిని.. బంధుపరంగా బలం, వర్గం లేదు..కేవలం జర్నలిస్గుగా నేను ఆ ఎన్నికల సందర్భంలో ప్రతి నిత్యం.. ప్రతి దినం ప్రాణాలొడ్డి డీఎల్ కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం నావంతుగా పనిచేయగలగడమే నా ధైర్యంకు కొలబద్ద.. నా సమర్థతకు గీటురాయి..
– నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
(జర్నలిస్టు డైరీలో మొదటి భాగం)
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో డీఎల్ రవీంద్రారెడ్డి వైద్యఆరోగ్యశాఖ మంత్రి.. అదే సమయంలో నేను సాక్షి పత్రికలో మైదుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పనిచేస్తున్నాను.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి కడప ఉప ఎన్నికల్లో పోటీకి దిగడం నేను పనిచేస్తున్న కాలంలోనే జరిగిపోయింది.. నాకు డీఎల్ చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ తనే పోటీకి దిగినప్పటికీ సాక్షిలో కొనసాగా నా జర్నలిజంకే కాదు..నాకు వ్యక్తిగత ప్రతిష్ట మంట గలుస్తుందనే భావనతో..
ఉప ఎన్నికల్లో డీఎల్ కు షాడో గా నన్నే సాక్షి యజమాన్యం ఉండమంది..
డీఎల్ బలమేంటో తెలిసి కూడా .. అదీ మంత్రిహోదాలో ఉండి ఎన్నికల బరిలో దిగినప్పుడు నేను మైదుకూరు కేంద్రంగా సాక్షిలో పనిచేయడం కత్తిమీద సాములాంటిదే.. వార్తలు రాయడం అటుంచితే.. డీఎల్ కదిలికలపై నేను షాడోగా వ్యహరించాల్సిన బాధ్యత సాక్షి యజమాన్యంపెట్టింది.. ముందుకు వెళ్లితే నుయ్యి..వెనక్కి వెళ్లితే గొయ్యి అన్నట్లు భయానిక పరిస్థితి. అంతకు ముందు డీఎల్ తో చాలా సన్నిహిత్యంగా ఉండటం ఒకకారణమైతే.. డీఎల్ ఆలోచనా విధానం నేను పసిగట్టగలననే కారణం ఇంకొక్కటి.. ఏదిఏమైతేనేమి నన్ను డీఎల్ కు షాఢోగా ఉండమని చెప్పడమే కాకుండా.. ఒంగోలు కు చెందిన సాక్షి జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులుతోపాటు .. మండలానికి ఇద్దరిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇద్దరు సాక్షి విలేకరులను మైదుకూరుకు పత్రికా యజమాన్యం ( సజ్జల రామ క్రిష్ణారెడ్డి) పంపించింది.. ప్రతిరోజు డీఎల్ ఇంటి వద్దకు వెళ్లాలి.. అక్కడ సాక్షి ఓబీ వ్యాన్ పెట్టుకోవాలి.. డీఎల్ కదలికలలను గమనిస్తూ ఉండాలి… డీఎల్ ఎక్కడికి వెళ్లినా వారి ని గమనిస్తూ నేను , ఒంగోలు శ్రీనువాసులు సాక్షి ఓబీవ్యాన్ తో వెళ్లేవాళ్లం.. డీఎల్ కదలికలను ఎప్పటికప్పుడు సాక్షి యజమాన్యంకు, పెద్ద రిపోర్టర్లకు సమాచారం అందించడమే కాదు.. డీఎల్ పై వ్యతిరేక వార్త కథనాలు ఎప్పటికప్పుడు నేనే ఇవ్వాల్సి వచ్చేది..
ఈ పొట్టోడే నాకు గట్టోడై అడ్డు నిలుస్తున్నాడంటూ ..
నేను జర్నలిస్టుగా రాక ముందు నుండి డీఎల్ తో సన్నిహిత్యం ఉండేది.. ఆక్రమంలో మన పొట్టోడు గట్టోడు అంటూ సంభోదించేవారు.. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నేను సాక్షిలో పనిచేయాల్సి రావడంతో డీఎల్ కు బాగా వ్యతిరేకిగా మారిపోయాను.. ఎక్కడికి వెళ్లినా షాడో నేను వెళ్లడం.. ప్రతిరోజు డీఎల్ కు వ్యతిరేక కథనాలు( ఆ సమయంలో సాక్షిలో నేను రాసిన కథనాలు చూస్తే మీకు తెలిసివస్తుంది) ఇవ్వడంతో నామీద చాలా చాలా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. పొట్టోడి కథ చూస్తా అంటూ నేనేంటో అంటూ ఎక్కడ పడితే అక్కడ నా పట్ల చివాట్లు పెట్టేవారు..
నేను డీఎల్ కదలికలు గమనించే క్రమంలో వారి ఇంటి ముందు చెట్టు కింద అలా ఉండిపోయే క్రమంలో.. వాడు అక్కడ ఉంటే లారీలో తొక్కిస్తా.. ఇక్కడి నుండి వెళ్లిపోమన్ను అంటూ హెచ్చరికలు తీవ్ర స్ధాయిలో చేశారు.. ఇక్కడుంటే ‘‘లారీతో తొక్కేస్తా అంటూ డీఎల్’’అన్న హెచ్చరికలను నేనే వార్తగా రాసుకున్న.. అంతే వారి వెంటే నేను వెళ్లాల్సి ఉన్నప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లేవాడిని.. ఎక్కడికి వెళ్తారో? ఏ ప్రదేశం తీసుకెళ్తారో? అన్న భయం నన్ను వెంటాడేది.. నాతో ఉన్నది వేరే జిల్లా రిపోర్టర్ కాబట్టి వారి మీద ఏ మాత్రంపగ ఉండదు.. నేను అతి దగ్గరగా ఉండి.. ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేయడంను డీఎల్ నే కాదు.. మరేవ్వరైనా సహించలేరు.. ఈ పరిస్థితుల్లో రోజు ఇలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇలా పనిచేయడం కంటే మానుకుందామనే ఆలోచన రాత్రిళ్లు వచ్చేది.. ఇలాంటి పరిస్థిత్తులో పత్రికలో మానుకుంటే నా మనుగడ ఉండదని కొనసాగాను.
. నన్నే టార్గెట్ చేసుకుని డీఎల్ మాట్లాడిన మాటలు.. భయాందోళన తో కూడిన హెచ్చరికలు వల్ల మిగతా జర్నలిస్టులు కూడా నాతో మాట్లాడటం మానుకున్నారు..( ఎక్కడ డీఎల్ కు వ్యతిరేకం అవుతామో అనే భావనతో).. నన్ను ఎన్ని మాటలు అన్నా.. చంపుతామని హెచ్చరికలు చేసినా.. డీఎల్ తో షాడో తిరగడమే కాకుండా వార్తలు కవరేజ్ కోసం ఎదురుగా వెళ్లి కూర్చుండేవాడిని.. డీఎల్ మాటలు బట్టి నన్ను చంపడం ఖాయమని జర్నలిజంలోని శత్రువులే కాదు.. బయట సమాజంలోని వ్యతిరేకులు కూడా బాగా ప్రచారం చేశారు.. ఎక్కడ బెదరలేదు.. వారి మాటలకు కృంగిపోలేదు.. రోజుకు కొత్త ఉత్సాహంతో వైఎస్ జగన్ రెడ్డికి అండగా ఎన్నికల్లో నావంతు సహకారం అందిస్తూ వచ్చాను.
నాన్న నిన్ను చంపుతామంటున్నారంట.. నీకైమేతే మాకెవ్వరు దిక్కు…
‘‘నాన్న నిన్ను చంపుతారంట కదా.. ఇప్పుడే జేజీ చెప్పింది..అందరూ అనుకుంటున్నారంట.. ఎందుకు నాన్న మనకు ఇంత కష్టంతో కూడుకున్న జర్నలిజం.. నీకేమన్నా అయితే మాకెవ్వరున్నారు నాన్న.. మమ్మల్ని చూసుకునేందుకు అంటూ ’’ నా పెద్ద బిడ్డ మాధురిరెడ్డి( అప్పుడు పదవతరగతి చదువుకుంటోంది) కన్నీటి పర్యంతమైంది.. ‘‘చాలించుకో నాన్న నీవు మాతో ఉంటావు అని వేడుకుంది’’..
‘‘నాన్న ఏడవ్వొద్దు.. ఏమీ కాదు.. నేను ఇప్పుడున్నపరిస్థిత్లులో అది ఎన్నికల సమయం.. సాక్షి నుండి మానుకుంటే నా మనుగడ ఉండటమే కాదు.. నేను బతికున్నా చచ్చిపోయినట్లే అమ్మ.. మన మధ్య నాన్న, కూతురు బంధం దేవుడు ఎంతవరకు రాస్తే అంతవరకు కొనసాగుతుంది.. తర్వాత పది సెకండ్లు ఉన్నమన్న దేవుడు ఉండనివ్వడు.. దాన్ని బట్టి నా రాత ఉంటుంది తప్ప నన్ను ఎవ్వరు చంపలేరు.. ఆ రోజుకే మన బంధం ముగియాలి అనుకుంటే చంపకపోయినా.. ఏదోక విధంగా నా ప్రాణాలు పోవల్సిందే మాధురి.. భయపడకు.. ఏమి కాదంటూ ’’ నా బిడ్డకు నచ్చజెప్పుకుని సాక్షిలో కొససాగాను..
(ఎన్నికల్లో సంగ్రామంలో వైఎస్ జగన్ కోసం నేను ప్రాణాలొడ్డి పనిచేయడంలో నా ధైర్య సాహసాలు ఏపాటివో జర్నలిస్టు డైరీ-2 వ భాగంలో అందించగలను)