అక్షరాలకు ఊపిరి పోశా.. ఆ అక్షరాలే నాకు గుర్తింపును సంపాదించాయి అని అనడంలో సందేహించను.. విస్మరించను కూడా.. ఎందుకంటే అమ్మకంటే అత్యుత్తమమైనది అక్షరం అని భావిస్తున్నా కాబట్టి.. ఆ అమ్మను పిలిచేందుకు కూడా ఈ అక్ష్తరమే తొడయింది.. ఇదే నాకు నిక్కార్చయిన జర్నలిజం.. జనాల కోసం పని చేయడం మరియు వారి కథాంశాలను బయటకు తీసుకురావడం గొప్ప అనుభూతి నింపడమే కాదు.. అలాంటి గొప్ప అవకాశం కొద్దిమందికే దొరుకుంది..
పాతికేళ్లకు పైగా జర్నలిజం వృత్తి.. నా వయస్సులో సగభాగం జర్నలిజంతో ముడిపడి ఉంది.. ఈ పాతికేళ్లకాలంలో నాకు గొప్ప అనుభూతిని.. మధురజ్ధాపకాన్నినింపిన వాటిలో కొన్ని.. నా జర్నలిస్టు డైరీలో భద్రపరుచుకునే ప్రయత్నం..
నేను రచించిన జలగీతం పుస్తకంను ఆవిస్కరించిన యుపీఏ ఛైర్ పర్సస్ సోనియాగాంధీ..
తెలుగుగంగ అంతర్భాగమైన బ్రహ్మసాగర్ జలాశయంను జాతీకి అంకితం చేసే క్రమంలో ఈ ప్రాంత కరువు నేపథ్యం.. పరిష్కారం గురించి ప్రత్యేక కథనాలు కూడుకున్న జలగీతం సంచికను నేనే రాశా.. ఆ సంచికను 2006 సెప్టెంబర్ 27న యుపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరింప చేయించారు..
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితరులు ఉండటం గొప్ప అనుభూతి.. భద్రతకారణాల వల్ల ప్రముఖులకే పుస్తక కార్యక్రమంలో పాల్గొన్నారు.. నా చేతులు మీదుగా రూపుదిద్దుకున్న సంచిక సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకోవడం నా జర్నలిజం జీవితంలో ఇదో గొప్ప మైలు రాయిగా నేను గర్వపడుతుంటాను..
రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు(డీఎన్ఎఫ్) అవార్డు అందుకున్నా…
ప్రముఖ వ్యాసకర్త.. జర్నలిస్టు యోధుడైన వి. హనుమంతరావు గ్రామీణ జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు డీఎన్ఎఫ్ సంస్ధ ద్వారా 2003లో ఉత్తమ జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు అవార్డులను ప్రకటించారు. ఆంధ్రభూమి దినపత్రికలో ఆర్యోగం.. వైద్యం.. జనాభా.. సంస్కరణల వంటి వాటిపై ఎడిటోరియల్ వ్యాసాలు రాశాను..
ఆ ఏడాది డీఎన్ఎఫ్ అవార్డును గ్రామీణ జర్నలిస్టు అవార్డును అందుకున్నాను..రాష్ట్ర స్ధాయిలో జరిగిన పోటీల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన నన్ను ఎంపిక చేశారు.. దేశ స్థాయిలో జర్నలిస్టు పితామహుడైన సాయినాధ్ (ముంబాయి)చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను.. ఈ అవార్డును ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవీ శాస్త్రి, టీవీ9 సీీీీఈవో రవిప్రకాష్, పలువురు పత్రికా ఎడిటర్లు, సీినియర్ జర్నలిస్టుల సమక్షంలో అవార్డుతోపాటు 12,500 నగదు అందుకున్నాను..
కడప ద్విశత్ధాబ్ది ఉత్సవం పురస్కరించుకుని మైదుకూరు ప్రాంత విశేషాలు, చరిత్రను అందరికీ తెలియజెప్పే క్రమంలో మైదుకూరు చరిత్ర…
ఈ మహత్తర కార్యం వెనుక ( ప్రత్యేక సంచికలో నా సంపాదకీయం)…
అభివృద్దీ, ఆదునీకరణ శరవేగంగా చోటుచేసుకుంటున్న ప్రాంతం మైదుకూరు నియోజకవర్గం. పంటకాలువలూ, చెరువులూ, దొరువులూ, వాగులూ, వంకలూ, పచ్చటి పైర్లు, అడవులూ మైదుకూరు శోభను ఇనుమడింప చేస్తున్నాయి.. ఎర్రచందనం, కేపీ ఉల్లి విలక్షణ జీవ వైవిధ్యానికి ఆనవాళ్లు ఈప్రాంత ప్రత్యేకతను చాటుతున్నాయి. మానవుని అవశేషాలకు అద్బుతమైన బెలుంగుహలకు అనాదిగా అలవాలంటా వెల్లివిరిస్తోంది. శ్రీ భైరవేశ్వర కోన, నాగనాధేశ్వర కోన, బ్రహ్మంగారి మఠం, శ్రీ లంకమల్లేశ్వర దేవస్ధానం, వనిపెంట చెన్నకేశవాలయం, పుష్పగిరి క్షేత్రం, ముక్కొటి మల్లేశ్వర దేవాలయం, మైదుకూరు మాధవరాయస్వామి దేవాలయం, సిద్దయ్య మఠం, యల్లంపల్లె శ్రీ తిరుమలనాథాలయం తదితర అధ్యాత్మిక క్షేత్రాలు వెలసిన విలక్షణ ప్రాంతం మైదుకూరు నియోజకవర్గం.
తమ దివ్య దిష్టితో భవిష్యత్తు ప్రపంచపు పోకడలను కాలజ్క్షానం ద్వారా వెల్లడించిన శ్ర మద్విరాట్ పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి, శ్రీ అవధూత నారాయణస్వామి, శ్రీ ఈశ్వరాంబ, శ్రీ పిచ్చిమాంబ, శ్రీ పుల్లయ్య స్వామి, శ్రీకేశవస్వామి, శ్రీ వెర్రెమ్మలాంటి సిద్దయోగూలూ, యోగినీ మాతలూ తమ పాదస్పర్శతో మైదుకూరు నియోజకవర్గంను పునీతం చేశారు.. బ్రహ్మంగారి వంటి గురువూ, సిద్దయ్య వంటి శిష్యుడూ మరోకరు లేరనే లోకోక్తికి మైదుకూరు నియోజకవర్గం పుట్టినిల్లు. నాచనసోమనాథకవి పుంగవుడు నివర్వించిన ప్రదేశమిది. ఈ ప్రాంతంలో స్ధాపించబడి, రాజ్యాధికారం, పాళెతనం వర్గాల దీప్తులను వెలగించిన పేర్నపాడు కోట, వన్నూరమ్మ కోట, కోమార్ల రచ్చకోటలతో పాటు వనిపెంట, గంజికుంట, తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె, నంద్యాలంపేట, జాండ్లవరం కోటలూ గతించిన చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలిచాయి.
బ్రిటీషు ప్రభుత్వ హయంలో నిర్మించిన కేసీ కెనాల్, మూడు దశాబ్ధాల కిందట నిర్మించిన తెలుగుగంగ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి అక్షయ పాత్రలుగా ఉపయోగపడుతున్నాయి. కేసీ కెనాల్ సవ్వడులూ , తెలుగుగంగ గలగలలూ ఈ ప్రాంత రైతాంగపు జీవన సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. నల్లమల కొండలు, పెన్నా కుందూ నదులు మైదుకూరు నియోజకవర్గం సరిహద్దు రేఖలుగా నిలుస్తున్నాయి.
ఇన్ని రకాలగా విలక్షణ వైవిధ్యాన్ని సొంతం చేసుకున్న మైదుకూరు నియోజకవర్గ విశిష్టతలను చాటే ప్రయత్నాలను గతంలో కొందరు మహనీయులు చేశారు.. కల్నల్ మెకంజ్ తన కైఫియత్తుల ద్వారా , సీపీ బ్రౌన్ తన నిఘంటవుల ద్వారా ఈప్రాంత సామాజిక పరిస్థితులను .భాషా సాంస్కృతిక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ఏనుగుల వీరస్వామయ్య అనే గొప్ప యాత్రికుడు తన కాశీయాత్ర చరిత్రలో ఈప్రాంత పరిస్థితులను పొందుపరిచారు. డాక్టరు కేతు విశ్వనాధరెడ్డి గ్రామ గ్రామాల చరిత్ర పరిశోధనలో బాగంగా నియోజకవర్గంలోని గ్రామాల చారిత్రక నేపథ్యాన్ని అందించేందుకు ఇతోధికంగా కృషి చేశారు. శ్రీ అవదానం ఉమామహేశ్వర శాస్త్రి తన కడప జిల్లా శాసనాలు, సంస్కృతీ చరిత్ర గ్రంథంలో ఈ ప్రాంత శాసనాలను శోధించడం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. కడప జిల్లా ద్విశతాబ్ధి ఉత్సవాల తరుణంలో మైదుకూరు చరిత్ర ప్రత్యేక సంచిక తీసుకువచ్చాను. ఈ సంచికలో మన ప్రాంత చరిత్ర విశేషాలను వెలుగులోనికి తీసుకురావడం జరిగింది.
..
వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రచించిన పుస్తకం ఆవిష్కరించిన వైఎస్ జగన్…
వంగి మాటలు మనకొద్దు.. ఒంగి ఒంగి వడవటాలు వద్దు. స్వష్టమైన ఉచ్చారణతో గొంతెత్తి అరవండి. వెన్నముక నిటారుగా చేసి నీరజవామలా వడవండి. జగనన్న ముఖ్యమంత్రిని చేసేందుకు మనం అధిష్టానాన్ని అడగటానికి సంకోశిస్తే ఎలా! భారతం చదివిన వాళ్లం.. అవసరమైతే రాజశేఖరుడి ఆశయం కోసం యుద్ధం చేసేందుకు కూడా
సిద్దపడాలి. మన రాజశేఖరుడి ఆశయసిద్ధికోసం ఉద్యమించడం మన విధి. ఇంత మంచి తరుణాన్ని పదులుకుంటే చరిత్ర క్షమించదు. ఇంకా మనకు వంగి మాటలు.. ఒంగి ఒంగి వడవటాలు ఎందుకు? అనే కోణంలో దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖర్రెడ్డి జీవిత కథ ఆధారంగా నేను రచించిన జనగీతం పుస్తకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి ఆవిష్కరించారు.. ఇది ఓ గోప్ప అనుభూతిని మిగిల్చింది..
( ప్రత్యేక సంచికలో నా సంపాదకీయం)
రాజశేఖరుడి ఆశయసిద్ధి కోసం ఉద్యమించాలి..
మహామనిషి.. ప్రజల మనిషి. ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి. ఎంత హుందాతనం. ఎంత రాజసం. ఏమా తెలుగువాడి పంచకట్టు. కదలికలోన కలగలుపులోన ఎవరైనా సాటి రాగలరా! నిలబడగలరా! ఆ అపరభగీరధుడి ముందు? అధికారంలోకి వచ్చివాటినుండి అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి.. కాదు తరగని శక్తి డాక్టరు వై.ఎస్. అంటే రాష్ట్ర ప్రజల్లో కదలాడే చిత్రం కనుమరుగైంది.
రైతు గుండె మీద చేయివేసుకుని ధీమాగా ఉన్నాడంటే.. పేద ధైర్యంగా కార్పోరేట్ ఆస్పత్రి గుమ్మం తొక్కుతున్నాడంటే.. గూటికే నోచుకోక అల్లాడి ఎండైన ఇందిరమ్మ వీడవ బడుగువర్గాలు హాయిగా ఐదురోతుతున్నాయంటే.. అది జనమేజయుడి విగ్మత ఫలితమే. దూరదృష్టి ఫలమే. తెలుగు ప్రజల గుండెల్లో చిరమైన స్థానం సంపాదించుకుని- భువికి దిగిన కార్యాన్ని పూర్తి చేశానన్న సంతృప్తితో రాజశేఖరుడు కదిలిపోయాడు. జననం జమ్మలమడుగు అయినా నిలిచింది భారతీయులందరి మదిలో. ఎంతెత్తు ఎదిగావయ్యా అవి అసూ య చెందిందేమో? మరణం ఇక రమ్మంది.
అందుకేనేమో ఆ నేత ‘వై’ అనకుండా దటీజ్ ‘వై.ఎస్’ అని చిరునవ్వుతో స్వాగతించారు. ఆ రాజశేఖరుడుగా మనకు దూరమయ్యాడు. జనహృదయంలో దేవుడిగా నిలిచిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నిత్యనూతనం. అది అంతర్గత ప్రజాస్వామ్యానికి చిహ్నమని అభిమానులు చెప్పుకుంటారు. అంత అసమ్మతిలోనూ అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే విషయం.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నాయకత్వం.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు 2004లో వై.ఎస్ అన్ని పార్టీలను ఏకం చేశారు. జనం కోసం.. జనంలోకి.. జనం ఘోషే తవ భాషగా.. జనం వెతలు తీర్చడమే తపనగా.. నడక! ఒకవైపు మండుతున్న భాముడు సెగలు కక్కుతున్న తారురోడ్లు.. దుమ్ము రేపే దారుల్లో సాగిన మహాప్రస్థావం! ఎండ తీవ్రతకు కళ్లు మైకం కమ్ముకున్నా.. కాళ్లు బొబ్బలు ఎక్కినా.. ఆ బాటసారి అలసిపోలేదు. 68 రోజులు ఏకధాటిగా.. 11జిల్లాల్లో 56 అసెంబ్లీ సెగ్మెంట్లను కాలివడకవ చుట్టుముట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ సాహసం.
ఈ పాదయాత్రే 2004, 2009 లో పార్టీని గెలిపించింది. కాంగ్రెస్ గెలిచిందిగానీ.. గెలిపించింది వై.ఎస్. తమ అధికారంలో ఉన్నంత కాలం అసమ్మతి అన్నదే లేకుండా చేసి, అన్ని సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించి.. ‘రాజకీయ చదరంగంలో తనను మించిన యోధుడు లేడని నిరూపించుకున్నాడు. ఆయన రూపొందించి అమలు చేసిన ప్రతి పథకం జనానికి చేరువయ్యాయి. జవ హృదయాల్లో మహారాజుగా నిలిచిపోయారు. అంతలోనే.. అనుకోని విధంగా అవంతలోకాలకు వెళ్లిపోయారు…
రాజశేఖరుడి మరణంతో రాష్ట్రంలో రాజకీయశూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను పూరించే జననేత ఉండనే ఉన్నాడు. అందరి నోట ‘జగన్’ జపమే వినిపిస్తోంది. అయితే ఈ సొట్టబుగ్గల యువసుందరాగుడిని కోరుకోవడానికి ఎవరికుండే కారణాలు వారికున్నాయి. తాకితే కందిపోయే శరీర ఛాయ, చిర్నగవు చెరగని మోము, తండ్రిని తలపించే సెగ్గుబిడియాలు. నెమ్మదైన స్వభావం, మృదువుగా వినిపించే స్వచ్ఛమైన తెలుగు భాష, అన్నింటికి మించి ఈ ఆకర్షణను రెట్టింపు చేసే |
కుటుంబనేపథ్యం.. ఇవన్నీ రాష్ట్రంలో ఓట్టను రాల్చే అంశాలే. 2014 లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టే అస్త్రంగా వై.ఎస్ జగన్మోహవరెడ్డిని రాష్ట్ర ప్రజానీకం, పార్టీ క్యాడం ఎక్కుపెడుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకే మాట ధ్వనిస్తోంది. ‘ జగన్ సీఎం కావాలి.. కావాలి..’