(జ‌ర్న‌లిస్టు డైరిలో ఓ పేజీ)

-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల రోజు ఆంధ్రజ్యోతి పత్రిక‌లో ‘‘అయితే సైకిల్ కు ఓటేస్కోండి’’ అంటూ ఒక క‌థ‌నం వ‌చ్చింది.. ఆ క‌థ‌నం అంత‌టితో ముగిసిపోలేదు.. నాలుగేళ్లుగా నానుతూనే వ‌స్తోంది.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ నుండి ఓటింగ్ వ‌ర‌కు డీఎల్ తో న‌డిచిన ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి సైతం ఇదే క‌థ‌నంను నాలుగేళ్లుగా మ‌రి చూపిస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.. ఉంటున్నారు కూడా.. రాజకీయంగా అయిదు దశాబ్ధాల అనుభవం కల్గిన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడితో పాటు ఆ పార్టీ శ్రేణులందరూ ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనంను ఆధారం చేసుకుని విమర్శలు సంధించడం వెనుక దాగిఉన్న కథ నేపథ్యంను  ‘‘జర్నలిస్టు డైరీ’’ ద్వారా వివరించే ప్రయత్నమే…

ఈ కథనం వెనుక దాగిన వాస్తవికత…

వైసీపీ పార్టీలో డీఎల్ ను అక్కున చేర్చుకునేందుకు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఒకటి కాదు.. మూడు దఫాలు డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన సందర్భాలున్నాయి.. వైఎస్ జగన్ చేత కండువా వేయించడమే కాదు..నామినేషన్ వేసే క్రమంలో కూడా తన పక్కనే పెట్టుకున్న సందర్భం కళ్లారా అందరం చూసిందే… ఎన్నికల ప్రచారం ముగిసే క్రమంలో ఖాజీపేటలో నాకు నీవు..నీకు నేను అన్నట్లు రఘురామిరెడ్డి, డీఎల్ చట్టాపట్టాలు వేసుకుని ప్రచారం చేశారు.. సీన్ కట్ చేస్తే..

2019 మార్చి 10 న అసెంబ్లీ ఎన్నికలు.. ముందు రోజు ఎన్నికలకు అందరూ సమాయత్తమవుతున్నారు.. నేను టీవీ9లో పనిచేస్తున్న క్రమంలో రేపటి రోజు ఎన్నికల కవరేజ్ నిమిత్తం మార్చి 9న సాయంత్రం నాతో పాటు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ టీవీఎన్ ప్రసాద్. మరికొందరు ( ఈనాడు రిపోర్టర్ భాస్కర్ రెడ్డి మినహా) రిపోర్టర్లు మాట్లాడుకుంటున్నాము.. అదే సమయంలో డీఎల్ యువసేన సభ్యుడొకరు అక్కడికి వచ్చారు.. ఖాజీపేట నుండి వస్తున్నాను వైసీపీ నాయకులు పత్తాలేరు.. డబ్బులు ఇచ్చేందుకు ఎవ్వరూ లేరు.. తన ఇంటి వద్దకు వచ్చి ఓటర్లు డబ్బులు అడుగుతుంటే ఇక్కడ నాయకులెవ్వరూ అందుబాటులో లేరు. మీ తెలుగుదేశం పార్టీకీ ఓట్లు వేసుకోమని చెప్పి లైట్ ఆప్ చేసి  డీఎల్ ఇంట్లోకి వెళ్లారు అంటూ డీఎల్  యువసేనసభ్యుడు చెప్పుకొచ్చారు..

ఇందేంటి డీఎల్ ఇలా మాట్లాడారా? అని అంద‌రూ సందేహ‌ప‌డ్డాము.. ఈ విష‌యంలో గురించి నేను డైరెక్ట్ గా డీఎల్ తో చెప్పే చ‌నువు ఉంది.. ఈస‌మ‌యంలో ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌స్తావ‌న గురించి అడ‌గ‌డం బాగుండ‌ద‌ని అన్పించింది.. ఆస‌మ‌యంలో అక్క‌డ మాజీ ఎంపీటీసీ బి. క‌రీముల్లా ఉన్నార‌నిచెప్పారు.. నేను ప‌క్క‌కు వెళ్లి క‌రీముల్లాకు ఫోన్ చేశా.. డీఎల్ ఇలా మాట్లాడారా? అని.. లేదు అన్నఅలా చెప్ప‌లేదు.. అలాంటి మాట‌లు అన‌లేదు అని నాకు చెప్పారు ( ఇప్పుడు కరీముల్లా మ‌న మ‌ధ్య‌లేరు). అక్క‌డే డీఎల్ అలా మాట్లాడ‌లేదనీ క‌రీముల్లా చెప్పాడు.. క‌రీముల్లా అక్క‌డే ఉన్నాడ‌ట అని చ‌ర్చిద్దామ‌ని విలేక‌రుల వ‌ద్ద‌కు వెళ్లే క్ర‌మంలో అనంత‌పురం జేఎన్‌టీయు కాలేజీ నుండి ఇంటికి వ‌చ్చే క్ర‌మంలో అప్పుడే బ‌స్టాండు బ‌య‌ట‌కు వ‌చ్చింది.. మా పాప రావ‌డంతో నేను డిస్క‌స్ చేయలేక‌పోయా.. స్కూటీలో పాప‌ను ల‌గేజీని తీసుకుని ఇంటికి వ‌చ్చాను.. పాప‌తో ఉండ‌టం వల్ల నేను ఆ విష‌యం గురించి ప్ర‌సాద్ తో కూడా మాట్లాడ‌లేక పోయా..

ఆరాత్రి 11 గంట‌ల ప్రాంతంలో రిపోర్ట‌ర్ ప్ర‌సాద్ ఫోన్‌…

పొద్దునే ఎన్నిక‌లు క‌దా క‌వ‌రేజ్‌కు వెళ్లాల‌నే క్ర‌మంలో ప‌దికే ప‌డుకున్నా.. ప‌ద‌కొండు స‌మ‌యంలో ఆంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్ ప్ర‌సాద్ నుండి ఫోన్ ‘‘ తెలుగుదేశం పార్టీకి ఓటువేసుకోమ‌ని డీఎల్ చెప్పింది నిజ‌మేనా అని’’వివ‌రాలు అడిగాడు.. నాకు పిచ్చి కోపం వ‌చ్చింది.. నీకు అవ‌స‌రమా? డీఎల్ అలా మాట్లాడారు అని మీ వద్ద సాక్ష్యం ఉందా.. నేను కరీముల్లాతో మాట్లాడా అదేమి లేదు అన్నాడని చెప్పా. ‘‘‘లేదు మా రిపోర్టర్ డెస్క్ కుచెప్పారంటే.. నన్ను అడిగారు..నేను వాస్తవమా లేదా అని మిమ్మల్ని కనుకుంటున్నాను అని’’ ప్రసాద్ అన్నారు.. వార్త రాయడానికే అడుగుతున్నాడేమో అనే ఆలోచనతో .. ‘‘నీవు వార్త రాసి సమస్యలు తెచ్చుకోవద్దు.. నీకెందుకు ఖాజీపేట వ్యవహారం గురించి’’ అంటూ సిరియస్ గా మాట్లాడా.. నాకు సంబంధం లేదు.. అది డెస్క్ వాళ్లు చూసుకుంటున్నారు అనిచెప్పారు.. నేను ఫోన్ పెట్టేసి పడుకున్నా..

పొద్దునే 5గంటలకే బాంబు పేల్చినట్లు దినపత్రిక కటింగ్ వాట్పాప్ లో..

ఆరుగంటలకే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంలో అయిదుకే నిద్రలేచి సెల్ చూసుకున్నా వాట్సప్ లో ఈ కథనం కటింగ్ వచ్చింది.. పైగా మైదుకూరు డేట్ లైన్ తో .. ఒక్క సారిగా గుండెలు గుంబేలు మన్నాయి.. ఈ కథనం వల్ల డీఎల్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లినట్లే కదా అన్నభయం వెంటాడింది.. ఆ సమయంలో ప్రసాద్ కు ఫోన్ చేసి బండబూతులు తిట్టా.. నాకేమి సంబంధం లేదు.. డెస్క్ వాళ్లు పెట్టారు అని.. మరి మీ డేట్ లైన్ ఎందుకు వస్తుంది అని ప్రశ్నించా.. నా తప్పేమి లేదు అన్నాడు.. ఈ వార్తాకథనంతో డీఎల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. ప్రసాద్ మీద ఏ ప్రయోగంకు సిద్దపడతారో అన్న భయాందోళనతో ఎన్నికల కవరేజ్ కు బయలుదేరా..లోపల భయం నన్ను వణికిస్తుండటంతో కారు నడపలేక మా ఇంటిగేట్ గొడ  గీక్కుంటూ వెళ్లింది.. అలా జరగడం వల్ల 15వేలు నాకు నష్టం వాటిల్లింది..

మైదుకూరుకు వెళ్లగానే నేను, భాస్కర్, ప్రసాద్ లు మాట్లాడుకున్నాం.. ఆసమయంలో కూడా నేను వార్త రాయలేదు అని ప్రసాద్ ఒక్కటే సమాధానం. ప్ర‌సాద్ చెప్పింది దాంట్లో నిజ‌మే ఉంది.. ఇక మండ‌ల రిపోర్ట‌ర్ త‌ను ఏది రాస్తేఅది పేప‌ర్ లో ప్ర‌చురితం కాదు..కాబోదు కూడా.. మ‌న ఇష్టాఇష్టాల‌కు సంబంధించి ఏ వార్త రావాల‌న్నా డెస్క్‌, ఎడిష‌న్ ఇన్‌ఛార్జ్ అనుమ‌తిలేనిదే ప్ర‌చురితం కాదు.. అలాంటిది డీఎల్‌కుసంబంధించిన వార్త విష‌యంలో ఓ చిన్న‌పాటి విలేక‌రి రాసిందే ప్ర‌చురితం కావ‌డం సాధ్య‌ప‌డుతుందా? ప‌డ‌దు.. వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసుకోమ‌ని డీఎల్ ఎక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌లేదు.. ప్రెస్మీట్ పెట్ట‌లేదు.. ఏదో నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగినది న‌లుగురు తో జ‌రిగింది వార్త‌గా మ‌ల‌చ‌బ‌డాలంటే అది పార్టీకి అస‌మ‌యంలో అండ‌గా నిల‌బ‌డాల‌న్నే య‌జ‌మాన్యం నిర్ణ‌యంతోనే  సాధ్య‌మ‌వుతుంది.. ఓ చిన్నపాటి విలేకరితో ఇది సాధ్యపడదు.. పత్రికలో పనిచేసిన అనుభవంతో వార్తా ప్రచురిత విధానం తెలిసినోడిగా … నేను కూడా ప్రసాద్ మాటకు ఏకీభవించా.. అందుకే ప్రసాద్ కు అండగా నిలబడ్డా..

ప్రసాద్ వైపే నిలబడాలని నిర్ణయించుకున్నా..

ఆంధ్రజ్యోతి ప్రసాద్ శెట్టి.. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు..ఇలాంటి స‌మయంలో డీఎల్‌కు మ‌నం చెప్ప‌డం వ‌ల్ల ప్ర‌సాద్‌కు ఇంకా స‌మ‌స్య జ‌ఠిలమ‌వుతుంద‌ని.. రాజ‌కీయ‌భ‌విష్య‌త్తు కాల‌రాసిన క్ర‌మంలో ఏ అఘాయిత్యానికి పాల్ప‌డ‌తారో అన్న ఆలోచ‌న‌.. డీఎల్‌కు ఈ క‌థ‌నం గురించి నేను చెప్ప‌డం మంచిది కాదు .. ఈ స‌మ‌యంలో తోటి మిత్రుడు ప్ర‌సాద్‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని దృఢ‌ంగా నిర్ణయించుకున్నా..

డీఎల్ ఫోన్ చేసిన‌ప్పుడు ఈ వార్త రావ‌డం లో ప్ర‌సాద్ పాత్ర ఏమి లేదు.. డెస్క్ వాళ్లు పెట్టారు అని చెబుదామ‌ని నిర్ణ‌యించుకున్నా.. అనుకున్న‌ట్లే డీఎల్ కొద్ది నిమిషాల్లో ఫోన్ చేశాడు.. ‘‘ఏంటివార్త ఇలా రాశాడు.. వాడికేమన్నా బుద్ది ఉందా అని.. వాడికి ఏమి సంబంధం లేదంటా.. డెస్క్ వాళ్లను ప్ర‌శ్నించండి అని డీఎల్‌కు చెప్పాను.స‌రే ప్ర‌సాద్ నెంబ‌రు చెప్పు అన్నాడు.. చెప్పా( ఆస‌మ‌యంలో నావ‌ద్ద‌నే ప్ర‌సాద్ ఉన్నాడు)’’. నాఫోన్ క‌ట్ చేయ‌గానే ప్ర‌సాద్‌కు ఫోన్ వ‌చ్చింది.. వార్తా క‌థ‌నం గురించి అడ‌గ‌డ‌మే కాదు..దీని వెనుక ఎవ్వ‌రున్న వ‌ద‌ల‌ను అంటూ హెచ్చ‌రిక‌ల‌తో కూడిన మాట‌లు డీఎల్ మాట్లాడారు.. తనకు ఈ వార్త వల్ల రాజకీయ డ్యామేజ్ అయిందంటూ చాలా సీరియస్ గా మాట్లాడారు.. డీఎల్ తీరుతో  ప్ర‌సాద్ భ‌య‌కంపితుల‌య్యారు..

ఈ క‌థ‌నం వెనుక మీ పాత్ర ఉంది అంటూ నాకు డీఎల్ ఫోన్‌..

‘‘ఈ క‌థ‌నం రాయ‌డంలో మీ పాత్ర ఉంటుంద‌ని.. ప్ర‌సాద్‌కు వార్తా రాసే ధైర్యం లేదు.. మీరు రాయించార‌ని నాకు కొంద‌రుచెబుతున్నారు.. ఇలా నా భ‌విష్య‌త్తును డామేజ్ చేస్తావా? అంటూ డీఎల్ ఆవేద‌న తో ’’ నాకు ఫోన్ చేశారు.. నా పాత్ర ఏమి లేదు.. మీరు తెలుసుకోండి.. ప్ర‌సాద్ కూడా నేను రాయ‌లేదంటున్నాడు డెస్క్‌ను అడిగితే మీకు ఎవ్వ‌రి పాత్ర ఉందో తెలిసిపోతుంది అంటూ నేను డీఎల్‌కు చెప్పుకొచ్చా.. మ‌రి కొద్దినిమిషాల్లో మా ప‌క్క‌న ఉన్న ఈనాడు భాస్క‌ర్ రెడ్డికి డీఎల్ ఫోన్ చేశాడు.. న‌న్ను డామేజీ చేయ‌డానికి మీరు ముగ్గ‌రు పుట్టాసుధాక‌ర్‌యాద‌వ్ తో కుమ్మ‌క్కై ఇలా వార్త రాశారు క‌దా.. ఇందులో నాగ‌శివ పాత్ర లేదు సార్‌.. ప్ర‌సాద్ కూడా నాకు తెలియ‌దు డెస్క్ వాళ్లు రాశారు అంటున్నారు అని డీఎల్‌కు ఈనాడు భాస్క‌ర్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నంచేసినా డీఎల్ న‌మ్మ‌లేదు..

వార్త రాయ‌డానికి వెనుక నాపాత్ర ఉంద‌ని.. ప్ర‌సాద్, నాగ‌శివ స‌పొర్టు లేద‌ని వార్త రాయ‌లేడ‌నే భావ‌న డీఎల్ లో నూటికి నూరు పాళ్లు అభిప్రాయంకు డీఎల్ వచ్చేశారు.. e ఆ వార్త కథనంతో  న‌న్ను టార్గెట్ చేసుకుని డీఎల్ మాట్లాడం ప్రారంభించారు.. క‌డ‌ప లో ప్రెస్ మీట్ పెట్టి ఆప్ ది రికార్డు కింద నా పేరు ఉచ్చ‌రించ‌కుండా ఓవిలేక‌రి కోటి సంపాదించారు..మీ య‌జ‌మాన్యం ఎందుకు చ‌ర్య తీసుకోదంటూ మాట్లాడిన విష‌యం ఆ స‌మ‌యంలో మీడియా మిత్రులలోనే కాకుండా.. మైదుకూరు టాక్ గా నిలిచిపోయింది..

వార్త క‌థ‌నం రావ‌డం వెనుకు మ‌న ప్రాత లేన‌ప్పుడు.. మ‌న‌ము ఎక్క‌డ లాలూచి ప‌డ‌నప్పుడు .. అది మ‌న పేరు ఉచ్చరించలేన‌ప్పుడు డీఎల్ మాట్లాడినంత మాత్రాన మ‌నం ప‌ట్టించుకోవల్సిన అవ‌స‌రం లేదనుకున్నా… నిజమేంటో కాల‌ముకే వదిలేశా..  నాలుగేళ్లు గ‌డిచింది.. కోటి వెనుక క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ది లేదు.. చచ్చింది లేదు.. నిరూపించిాంది లేదు.. ఈ కథనం కారణంగానే డీఎల్ తో నాకు నాలుగేళ్లుగా  మాిటా లేదు మంతి లేదు..

డీఎల్‌తో నాకున్న బంధం ఏపాటిదంటే..!

1985 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే నాకు ఓటు హ‌క్కు వ‌చ్చింది.. ఆకాలంలో 13ఏళ్ల కే ఓట‌ర్ల జాబితాలో పేరు ఉండేది.. ఆ వ‌య‌స్సులో అప్పుడ‌ప్పుడే మాకు రాజ‌కీయ అవగాహ‌న మొద‌లైంది.. స‌మితికి ఊటుకూరు రామిరెడ్డి పోటీచేసిన‌ప్పుడు మాప‌ల్లెలో బండ‌ల మీద గంట గుర్తుకే మా ఓటు అని మేము పేర్లు రాసేంత‌.. 1983 నుండి డీఎల్‌కు మాప‌ల్లె ప‌ట్టుగొమ్మ‌. ఊరంతా డీఎల్ కు ఏక‌ప‌క్షంగా 2004 వ‌ర‌కు సాగింది. ఆ క్ర‌మంలో డీఎల్ ప‌ట్ల మాకు ఒకింత అభిమానం ఉండేది.. నేను జ‌ర్న‌లిజంలోకి రాకముందు మా పోలింగ్ కేంద్రంలో డీఎల్‌కు ఏజెంట్ గా కూర్చున్న కూడా.. ఆక్ర‌మంలో డీఎల్‌కు ప‌రిచ‌యం మొద‌లైంది.. నేను డీఎల్ నుండి వ్య‌క్తిగ‌తంగా ఆశించింది ఒక్క‌టే ఒక్క‌టి అది 1989 కాలంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ట్రైసం కింద విడియో కెమోర శిక్ష‌ణ కింద ఎంపిక కోసం రెక‌మెండ్ చేయ‌మ‌ని.. నేను ఇళ్లు, భూమి ఆస్థులు తాక‌ట్టు పెట్టి బ్యాంకులో రుణం పొందా.. అది జ‌రిగింది.
2007 లో డీఎల్ ఎమ్మెల్యే. మైదుకూరు జ‌డ్పీ హైస్కూల్ నందు ఒక ప్రోగామ్ జరుగుతోంది.. స్టేజీ మీద నుండి డీఎల్ ఫోన్ చేశారు.. ‘‘మా కూతురు అల్లుడు హైద‌రాబాద్ నుండి తిరుమ‌ల వ‌స్తున్నారు.. మ‌నం వెళ్తాం.. మీరు ఇంటికి వెళ్లి స్నానంచేసిరా .. మాట్లాడుకుంటూ వెళ్లాలి’’ అన్నారు. మొక్కుబ‌డి మీద క‌దా స‌ర్‌.. నేను మాములుగా వ‌స్తాలే.. వెళ్తాం పద అన్న‌. అక్క‌డ నుండే కారులో డీఎల్ తో ఖాజీపేట‌కు వెళ్లా..అక్క‌డే అంద‌రం క‌ల‌సి తిన్నాము.. తిరుమ‌ల వెళ్లాము.. ద‌ర్శ‌నంకు అల్లుడు,కూతురు,మ‌న‌మ‌రాలుతో ర‌డీ అయ్యి గెస్ట్ హౌస్ నుండి డీఎల్ దంప‌తులు బ‌య‌ట‌కు వ‌చ్చారు.. నేను మ‌ధు అక్క‌డే ఉన్నాము.. నాగ‌శివా నీవు ర‌డీ అయ్యిరాపో.. నీ కోసం నేను బ‌ట్ట‌లు కూడా తీసుకువ‌చ్చా అన్నారు.. వ‌ద్దులే సర్‌.. అని తిర‌స్క‌రించా. వెళ్లి ర‌ఢీ కాపో అంటూ హుకుం జారీ చేశారు.. ఆ స‌మ‌యంలో డీఎల్ మాట అయిష్టంతో అంగీక‌రించా. కాట‌న్ చొక్క‌, అంచుపంచా వేసుకునివచ్చా..  బాగుంది నీకు డ్ర‌స్‌. మా ఇంట్లో ఇలాంటివి ఆరు జ‌త‌లున్నాయి. అవి ఇస్తాలే అన్నాడు.. నీకు బాగుంటాయి అన్నాడు.. ఈ బట్టలే వేసుకునేందుకు ఇష్టం లేని నాకు మిగిలిన బట్టలు  అవ‌స‌రం లేదు స‌ర్‌.. అని ఘంటా పథంగా చెప్పేచా….
2019 ఎన్నిక‌ల ముందు మొద‌టి సారిగా ఖాజీపేట‌లోని గుజ్జ‌ల రామ‌క్రిష్ణ ఇంట్లో డీఎల్ ,పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్ భేటీ..క‌వ‌రేజ్‌కువెళ్లాం.. క‌డ‌ప నుండి కూడా జ‌ర్న‌లిస్టు సోద‌రులు వ‌చ్చారు.. పోగ్రామ్ అయిపోయాక నామిత్రుడు బ‌క్క‌సుబ్బారెడ్డి, అర‌వింద సంజీవ‌రెడ్డిలు జర్న‌లిస్టుల‌కు భో్జనం పెట్టించు అంటూ 5వేలు నాకు ఇచ్చారు..నేను వొద్దు అని సుబ్బారెడ్డితో అన్నా.. నీవు పెట్టుకోవ‌డం ఎందుకు అంటూ బ‌ల‌వంతంగా 5వేలు చేతిలో పెట్టారు.. పొద్దునే నీవు కూడా 5వేలు తీసుకున్నావా గ‌జ్జ‌ల రామ‌క్రిష్ట ద‌గ్గ‌ర అన్నాడు.. చాలా బాధేసింది.. నేను అడ‌గ‌లేదు.. నీవు ఎందుకు పెట్టుక‌వోడం అంటూ బక్క‌సుబ్బారెడ్డి, సంజీవ‌రెడ్డి అన్న ఇచ్చారు.. అలా తీసుకోవ‌డం త‌ప్పు క‌దా అన్నాడు.. స‌రే అని సుబ్బారెడ్డికి అయిదువేలు వెనక్కి ఇచ్చా.. మ‌రినేను 5వేలు తీసుకోవ‌డం డీఎల్‌న‌చ్చ‌న‌ట్లు లేదేమో.. అడిగేశారు.. నేను వారి మాటకు స్పందించా..

డీఎల్‌కు సంబంధించిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనే కాదు.. ఏ అధికార‌, రాజ‌కీయ కార్య‌క్ర‌మం నిర్వాహ‌ణ‌లో జ‌ర్న‌లిస్టుగానే కాకుండా, ఓ అభిమానిగా  రూపాయి కూడా చేయిచాచి తీసుకున్నది లేదు.. అంతే కాదు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ  నా పిల్లల విషయంలో ఏ సాయం అడగలేదు.. పొందలేదు..  నా వ్యక్తిగతంగానూ ఏ విధమైన   సాయం పొందిన సంద‌ర్ధాలు లేవన్న‌ది నామ‌న‌సుకు తెలిసిన ప‌చ్చినిజం. ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నం వ‌ల్ల డీఎల్ కు రాజ‌కీయం పెద్ద ప్ర‌భావమే చూపిండవొచ్చు.. అలాంటి సమయంలో ఇలాంటి కథనం రావడం పెద్ద డ్యామేజ్ గా అంద‌రం అంగీకిరించాల్సిందే.. ఈ ప‌రిస్థితుల్లో ఈ క‌థ‌నం వెనుక నాహస్తం ఉందనే ఆవేదన తో  డీఎల్‌ను అలా మాట్లాడి ఉండిండొచ్చు ..

ఇక్క‌డ మ‌రో ప్ర‌స్తావ‌న . డీఎల్ ర‌వీంద్రారెడ్డితోనే కాదు.. ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతూ అధికారాల్లో కొన‌సాగుతూ వ‌చ్చిన ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి, 2014 తెలుగుదేశం పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ల‌తోపాటు స్ధానిక సంస్థ‌ల ప్ర‌తినిధులుగా ఎన్నికైన ఏ నాయ‌కుడి వ‌ద్ద కానీ ఇదే నిక్క‌ర్చి.. నేను చెప్పిన నేతలంతా మన మధ్యనే ఉన్నారు.. నేను చెప్పిన ప్రతిది నిర్ధారించుకునే అవకాశం ఉండనే ఉంది ( ఈ కథనం వెనుక కోటి ప్రచార కథ ఉండిన నేపథ్యంలో వివరించే ప్రయత్నమే)

గుజ్జల గురించి కొద్దిగా ..

ఆప్కో ఛైర్మ‌న్ గా ప‌నిచేసిన గుజ్జ‌ల శ్రీను ఆర్థిక ఫ‌లాలు పంచ‌డంలో అందే వేసిన చేయి అంటారు.. అంద‌రూ చేయిచాసిన వాళ్లే అంటూ ఉంటారు.. అందులో వాస్త‌మెంతో..! అబ‌ద్ధ‌మెంతో..! వారి వారి మ‌న‌సాక్షికి తెలుసు..అలాంటి ఆర్ధిక కుబేరుడు మ‌న‌ప్రాంతానికే చెందిన వాడైన‌ప్ప‌టికీ నేను ఒక్కేసారి సాయం అడిగా అది కూడా ఏపీజేఎఫ్ మిత్రులు   నన్ను అడగమని వత్తిడి చేయడంతో .. ఏపీజేఎఫ్ జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ కు విజ‌య‌వాడ‌కు బ‌స్ సౌక‌ర్యం కోసం.. నేను అడిగ‌గానే ఓకే మిత్ర‌మా 25వేలు పంపించారు ( నేను సాయం మాత్రమే అడిగా.. డబ్బులు వ్యవహారంలో నేను దూరంగా ఉండిపోయా).. జర్నలిస్టు సంఘం మీటింగ్ కు వెళ్ల లేదు.. కేవలం జర్నలిస్టు మిత్రుల కోసం ఆ మాట అడిగా.. ఇది  ఒక్కటే అపర కుబేరిడితో నామాటగా  జర్నలిస్టు సంఘం (ఏపీజేెఎఫ్) పొందిన సాయం..

కొసమెరుపుః ఈ కథనం వెనక ఇంత కథ నడిచింది.. అయితే ఆ కథనం గురించి డీఎల్ మరిచిపోయినా.. వైసీపీ అండ్ కో మాత్రం మరిచిపోలేదు.. డీఎల్ విమర్శ చేసిన ప్రతి సారీ ఈ కథనంను చూపిస్తూ ప్రెస్మీట్ పెట్టి తమ పబ్బం గడుపుకుంతున్నారనే తప్ప.. ఈ కథనం ప్రస్ధావించిన ప్రతి సారి.. ఓ విధమైన వేదన..  నాలుగేళ్లుగా డీఎల్ పై విమ‌ర్శ చేసే క్ర‌మంలో ‘‘అయితే సైకిల్‌కు ఓటేస్కోండి’’ ఆంధ్రజ్యోతి లో వ‌చ్చిన‌క‌థ‌నంను పోటో స్టాట్ చేయించుకుని మ‌రీ మ‌రీ చూపిస్తూ ప్రెస్‌మీట్లు పెడుతున్న ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి అండ్ కో బృందంకు అదే ఆంధ్ర‌జ్యోతిలో మైదుకూరులో ప్రాంతంలో జ‌రిగే ఇసుక అక్ర‌మాలే కాదు.. కోటి భూ క‌బ్జా.. భూ ఆక్ర‌మ‌ణ‌లు గురించి వ‌స్తున్న క‌థ‌నాలు ఎందుకు క‌న‌ప‌డ‌వు.. ఎందుకు ప్రెస్ మీట్ లో ఆకథనాలను  పోటో స్టాట్ చేయించి చూపిస్తూ ఇది నిజ‌మంటూ  డీఎల్ పై వచ్చిన కథనం తరహాలో  చెప్పడం లేదు.. వేరే కథనాల్లో ఎందుకు మతలబు?  డీఎల్ పై వచ్చిన కథనమే యధార్తమైనప్పుడు.. మీ కథనాల్లో యధార్థము ఉన్నట్లే కదా?   అది అంగీకరించినప్పుడు.. మిగతా కథనాలు అంగీకరిస్తే అప్పుడు మీ పట్ల, రఘురామిరెడ్డి అండ్ కో పట్ల విశ్వసనీయత అందరిలో కల్గుతుంది, యధార్థ వాదులు అన్న బిరుదు సొంతమవుతుంది.. ‘‘అయితే సైకిల్‌కు ఓటేస్కోండి’’ కథనం ప్రచురితం చేసిన ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఇతర కథనాలు కూడా ఇలాగే పదే పదే చూపితే.. ప్రజల్లో విశ్వసనీయత కూడా లభిస్తున్నది వైసీపీ అండ్ కో తెలుసుకోవల్సిన అగత్యం ఎంతైనా ఉంది..