బి.మ‌ఠం త‌హ‌శీల్దారు కిషోర్‌రెడ్డి ప‌ట్ల వైసీపీ ప్ర‌జానేతలు వ్య‌వ‌హ‌రించిన తీరు.. అధికారుల్లో ఆందోళ‌న క‌ల్గిస్తోంది.. మండల మెజిస్ట్రేట్ ప‌ట్ల‌నే నేత‌లు, నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరు అటు అధికార‌గ‌ణంలోనే కాకుండా.. ప్రజాక్షేత్రంలోనూ విస్మ‌యంకు గురిచేస్తోంది. మండ‌ల త‌హ‌శీల్ధారు ప‌ట్ల బెదిరింపు కావొచ్చు.. ముప్పేట దాడి అనుకోవ‌చ్చు.. ఈ ప‌ర్య‌వ‌సాన ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది అధికార వైసీపీ వ‌ర్గాల్లో సందేహం లేవ‌నెత్తుతోంది.. ఇక్క‌డి ప్ర‌జా నేత‌లు, పార్టీల నాయ‌కులు మండ‌ల మెజిస్ట్రేట్ పైకి దూసుకెళ్ల‌డ‌మే కాదు.. బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం.. దాడికి దిగినంత వాతావ‌రణం స్ప‌ష్టించ‌బ‌డ‌టం వెనుక రాజ‌కీయ స్వ‌యంప్ర‌తిప‌త్తి వీరికి సొంతం చేయ‌బ‌డింద‌నే అభిప్రాయం ఆ పార్టీలోని ఇత‌ర ప్రజానేత‌ల్లోనూ, పార్టీ క్యాడ‌ర్ లో వ్య‌క్త‌మ‌వుతోంది.

-నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

ఆస‌రా ప‌థ‌క కార్య‌క్ర‌మం త‌ర్వాత చోటు చేసుకున్న ఘ‌ట‌న‌….

బి.మ‌ఠంలో నిన్న‌టి దినం వైఎస్ఆర్ ప్ర‌భుత్వ ఆస‌రాప‌థ‌క కార్య‌క్ర‌మం జ‌రిగింది.. ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.. మ‌ధ్యాహ్నంకు కార్య‌క్ర‌మం ముగిశాక జ‌డ్పీటీసీ రామ‌గోవిందురెడ్డి , స‌హ‌కార బ్యాంక్ ఛైర్మ‌న్ నేల‌టూరు సుబ్బారెడ్డి, ప‌లుగురాళ్ల‌ప‌ల్లె ఉప‌స‌ర్పంచ్ దుగ్గిరెడ్డి, చౌద‌రివారిప‌ల్లె స‌ర్పంచ్ ఓబుల్రెడ్డి, అనుచ‌రులు త‌హ‌శీల్దారు కిషోర్‌రెడ్డిని క‌లిసేందుకు వెళ్లారు.. అక్క‌డ ఈనెల‌లో నిర్వ‌హించ‌బోయే అసైన్ మెంట్‌క‌మిటీ లో ల‌బ్ధిదారుల ప్ర‌స్తావ‌న చోటుచేసుకుంది. అసైన్‌మెంట్ క‌మిటీలో వైసీపీ పార్టీకిచెందిన వారిని ల‌బ్ధిదారులు గా చేర్చాల‌నే డిమాండ్ కూడా ఈ నేత‌ల నుండి వ్య‌క్త‌మైన‌ట్లు.. నిబంధ‌న‌ల మేర‌కు ల‌బ్ధిదారుల జాబితా సిద్దం చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క‌మిటీలో ఎలాంటి అక్ర‌మాల‌కుచోటు ఇచ్చే ప్ర‌స‌క్తి ఉండ‌దంటూ త‌హ‌శీల్ధారు కిషోర్ రెడ్డి ఖ‌రాఖండిగా చెప్పిన నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు అస‌హానంకు గురైయ్యార‌నే స‌మాచారం..

ఈక్ర‌మంలో రెవిన్యూ కార్యాల‌యం మ‌ర‌మ్మ‌త్తుల‌కు క‌లెక్ట‌ర్ ఆరు ల‌క్ష‌లు కేటాయించార‌ని.. మీవంతు స‌హ‌కారం అందించాల‌ని ఈ సంద‌ర్భంలోనే వైసీపీ నేత‌ల మ‌ధ్య త‌హ‌శీల్దారు ప్రస్తావ‌న తీసుకువ‌చ్చిన నేప‌ధ్యంలో.. మీరు లంచాలు తీసుకుంటున్నారు క‌దా.. ఆడ‌బ్బుల‌తో మీరు క‌ట్టుకోండనే స‌మాధానం వైసీపీ నేత‌ల నుండి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇంత మందిలో లంచాలు గురించి మాట్లాడ‌ట‌మేమిటి అంటూ త‌హ‌శీల్దారు కిషోర్ రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తంచేయ‌డం.. ఒక రేష‌న్ కార్డు కోసం వీఆర్వోకు 3వేలు లంచం ఇచ్చానంటూ ఇందులోని ఓ వైసీపీ నేత అన‌డంతో అక్క‌డ వాతావ‌రం వేడేక్కింది..

త‌హ‌శీల్దారు కార్యాల‌యంలో వాడివాడిగా ..వేడి వేడిగా వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో వైసీపీ నేత‌లు బ‌య‌ట‌కు విచ్చేశారు.. కార్యాల‌యంకు సంబంధించి మ‌ర‌మ్మ‌త్తులు ప‌నులు జ‌రుగుతున్నాయి.. కార్యాల‌యం కు సంబంధించిన ప్ర‌హారీగోడ కూల్చి అక్క‌డ స‌హ‌కార బ్యాంక్ క‌డ‌దాము అంటూ వైసీపీ నేత‌లు గ‌ట్టిగా మాట్లాడుకుంటున్న నేప‌థ్యంలో త‌హశీల్దారు కిషోర్‌రెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చారు..ఇది రెవిన్యూ కు చెందిన స్థ‌లం ఇక్క‌డ క‌ట్టుకుకోవ‌డం ఏంటి అని వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు..

దీంతో అక్క‌డే ఉన్న జ‌డ్పీటీసీ రామ‌గోవిందురెడ్డి ‘‘ మీరు దౌర్జన్యం పోకండి.. మీ ఆస్తి కాదు.. నా ఆస్ధికాదు.. ఈ రోజు ఉంటావు రేపుపోతావు.. ఈ వైసీపీ పాలన ఉన్నంత వరకు ఇక్కడే ఉండే నాకొడకలం అంటూ తహశీల్దారు కిషోర్ రెడ్డితో వాదనకు దిగారు.. నేను ఉన్నంత వరకు నేను చేయాల్సిందే కదా అంటూ తహశీల్దారు చెప్పుకొచ్చారు.. ‘‘ ఇది బి.కోడూరు మండలం కాదు బయపడటానికి….నీకు అర్ధం కాలేదు.. కోట్లు ఖర్చుపెట్టే నాకొడుకుల మండలమిది.. అయిదు రోజుల్లో ఈ సీటులో కూర్చోకుండా చేయగలగే కెపాసిటి నాకుంది .. ఎమనుకుంటున్నావో ’’ అంటూ తహశీల్దారును రామగోవిందురెడ్డి భయపెట్టే విధంగా వ్యాఖ్యలుచేశారు..

రామగోవిందురెడ్డి వ్యాఖ్యల్లో నిజమున్నట్లే కదా.. అందుకే రాజకీయ స్వయం ప్రతిపత్తి..!

త‌హ‌శీల్దారు కిషోర్ రెడ్డి తో వాద‌న‌లో రామ‌గోవిందురెడ్డి అన్న వ్యాఖ్య‌ల్లో నిజ‌మున్న‌ట్లే క‌దా.. కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ప్పుడు మండ‌లంలోరాజ‌కీయ పెత్త‌నంచేసే అధికారంతోపాటు.. ప‌లు రాజ‌కీయ నిర్ణ‌యాల్లో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి కి సంబంధం లేని స్వ‌యం ప్ర‌తిప‌త్తి కల్గిఉన్నామ‌నే అర్ధం అందులో ఉన్న‌ట్లు క‌దా.. అందుకేనేమో ఈ మండ‌లంలో ఏ అధికారి నియామ‌కం జ‌ర‌గాల‌న్నా.? ఏ ప‌ని జ‌ర‌గాల‌న్న కోట్లు ఖ‌ర్చు పెడుతున్న నాయ‌కుల‌కే అధికార‌ప‌వ‌ర్ ఉన్న‌ట్లుంద‌ని చెప్ప‌క‌నే అర్థ‌మ‌వుతుంది.. బి.మ‌ఠం మండ‌లంలో లాగా కోట్లు ఖ‌ర్చు పెట్టే నాయ‌కులు నియోజక‌వ‌ర్గంలోని ఇత‌ర మండ‌లాల్లో లేన‌ట్లేనా? అందుకే ఆ ప్ర‌జానాయ‌కులకు, నాయ‌కుల‌కు రాజకీయ‌నిర్ణ‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తిలేనిది..

జెండా ఆవిష్క‌ర‌ణ‌కు కూడా పిలుపులేదంటే ఛైర్మ‌న్‌ మాచునూరు చంద్రకు  ‘‘అధికార స్వ‌యం ప్ర‌తిప‌త్తి’’ లేన‌ట్టేనా..?

అధికారంలోకానీ, రాజ‌కీయ ప‌రంగా కానీ స్వ‌యం ప‌త్రిప‌త్తి లేనందునే రిప‌బ్లిక్ డే దినోత్స‌వం సంద‌ర్భంగా పుర‌పాలిక కార్యాల‌యంలో ప‌తాకావిష్క‌ర‌ణ‌కు క‌మీష‌న‌ర్ నుండి కూడా ఛైర్మ‌న్ మాచ‌నూరు చంద్ర‌కు ఆహ్వ‌నం ద‌క్క‌కుండా చేశార‌న్న‌ది ఇందులోని ప‌ర‌మార్ధం క‌దా.. పురపాలిక ఛైర్మ‌న్ ఎన్నిక‌లో బి.మ‌ఠం నాయ‌కుల త‌ర‌హాలో మాచునూరు చంద్ర కోట్లు ఖ‌ర్చు చేయ‌లేక‌పోయారా?

ఒక‌వేళ చేసినా బి.మ‌ఠం నాయ‌కుల స్ధాయిని అందుకోలేక స్వ‌యం ప్ర‌తిప‌త్తి కి దూర‌మ‌య్యారా? అదే కాకుంటే.. త‌న‌కు ప‌తాక ఆవిష్క‌ర‌ణ ఆహ్వ‌నం క‌మీష‌న‌ర్ ఇవ్వ‌కుండా వివ‌క్ష‌త చూపుతున్నారంటూ మీడియా స‌మావేశం పెట్టి ఛైర్మ‌న్ మాచునూరు చంద్ర త‌న గోడు ఎందుకు వెళ్ల‌గ‌క్కుతారు..? అధికారుల నుండి త‌న‌కు స‌హ‌కారం అంద‌లేదంటూ ఎందుకు ఫిర్యాదులు చేస్తాడు.

. బి.మ‌ఠం నాయ‌కుల లాగా స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండ‌గ‌లిగింటే ప‌తాక ఆవిష్క‌ర‌ణ రోజు త‌న స‌త్తా చాటేవారు.. పెత్త‌నం చెలాయించే వారు. ‘‘ఆ మండ‌ల నాయ‌కుల‌కు ఉన్నంత స్వేచ్చ , రాజ‌కీయ పెత్త‌నం మాకు లేదంటూ’’ మైదుకూరు పురపాలిక ఛైర్మన్ మాచునూరు చంద్ర నే కాదు.. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో వైసీపీ పార్టీ ప్రజానేతలు, పార్టీ నాయకుల్లో నిట్టూర్పు వ్యక్తమవుతోంది..

పదవి బాధ్యతలు తీసుకున్న మొదట్లోని తహశీల్దారుపై రాజకీయ దాడి..!

సోమిరెడ్డిపల్లె పంచాయతీలోని క‌స్తూరిబా పాఠ‌శాల‌కు 2010లో డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న‌ప్పుడు యాద‌వ్ న‌గర్ కే చెందిన క‌స్తూరి బా స్కూల్ కు త‌మ్మిశెట్టి గుర‌వ‌య్య , గుర‌మ్మ లు నాలుగున్న‌ర ఎక‌రా భూమిని అప్ప‌గించారు.. ఆ భూమికి బదులుగా ఆప్రాంతంలో మిగులుగా ఉన్న 4.5 ఎక‌రాను డీఎల్ ర‌వీంద్రారెడ్డి ప్ర‌భుత్వం నుండి ఇప్పించారు.. ఆ భూమి ఆప్రాంతంకు చెందిన కొంద‌రు ఆక్ర‌మించుకున్నారు..దీనిపై గుర‌వ‌య్య పెద్ద‌పోరాట‌మే చేశారు.. గ‌వ‌ర్న‌ర్‌,రాష్ట్ర‌ప‌తిల‌కు ఫిర్యాదు చేసి మ‌ళ్లీ ద‌క్కించుకున్నారు..

ఆక్ర‌మ‌ణ‌లో ఆభూమిని తిరిగి గుర‌వ‌య్య‌కు అప్ప‌గించేనిమిత్తం ఈ త‌హ‌శీల్దారు కిషోర్ రెడ్డి స‌ర్వేకు వెళ్లారు.. ఆ స‌మ‌యంలో వైసీపీ లోపి స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్గిన నాయ‌కులో ఒక‌రు త‌హ‌శీల్దారు పై ఆక్ర‌మ‌ణ దారులతో స‌భ్య‌స‌మాజంలో ప‌లుక లేని ప‌దాల‌ను సైతం ఉప‌యోగించారు.. ఈ తతంగంను త‌హ‌శీల్దారు విడియో తీసి.. పోలీసు స్టేష‌న్కు ఫిర్యాదు చేసిన‌ట్లు ప్రచారం ఉంది.. వైసీపీ నాయ‌కుల సూచ‌న‌లు అనుకోవ‌చ్చు.. హెచ్చ‌రిక‌లు అనుకోవ‌చ్చు మండ‌ల మెజిస్టేట్ చేసిన ఫిర్యాదుకే దిక్కులేకుండా పోయింద‌ట‌.. ఆ స‌మ‌యంలో త‌హ‌శీల్దారు త‌న‌పై జ‌రిగిన దాడిని మిడియాకు వివ‌రించేందుకు సిద్ద‌ప‌డి రాజ‌కీయ వ‌త్తిడి ఫలితమో మిన్న‌కుండిపోయార‌నే మాట విన‌ప‌డుతోంది. వైసీపీ నేత‌లు బెదిరింపుల నేప‌ధ్యంను ఆర్డీవోకి ఫిర్యాదు చేసిన‌ట్లు త‌హ‌శీల్దారు కిషోర్ రెడ్డి మీడియాతో చెప్పారు..

ఆధికారులంటే\ మాకు గౌర‌వమేః జడ్పీటీసీ రామ‌గోవిందురెడ్డి


‘‘అధికారులంటే మాకు గౌర‌వ‌మే అని.. ఘ‌ర్ష‌ణ చేయ‌లేదు.. మాట్లాడ‌టంలో గ‌ట్టిగా వాద‌న అంతే.. రెవిన్యూ కార్యాల‌యం ప‌క్క సొసైటి భ‌వ‌న నిర్మాణం విష‌యంలో మా వాళ్లు మాట్లాడాల్సి వ‌చ్చింది త‌ప్ప‌, ఘ‌ర్ష‌ణ.. బెదిరింపులు అనే ప‌దాలు వాడాల్సిన అవ‌స‌రం లేదంటూ’’ బి.మఠం మండలాధ్యక్షుడు వీరనారాయణరెడ్డితో కలసి జడ్పీటీసీ రామగోవిందురెడ్డి వివరణ ఇచ్చారు..