నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి మ‌రో ప్ర‌త్యామ్నాయం ఉందా..? ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డిని కాద‌ని వైసీపీ పార్టీ త‌రుపున మ‌రోక‌రిని ఎన్నిక‌ల బ‌రిలోకి దింపే సాహ‌సం వైఎస్ జ‌గ‌న్ చేయ‌బోతారా..? ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌బోర‌నే ప్ర‌చారం ఎందుకు న‌డుస్తోంది..? ఈ ప్ర‌చారంకు తెర‌తీస్తున్న‌ది స్వపక్షంలోని విపక్షమా ..? ఈ ప్రచారం మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు సాగుతోంది..? ప్రముఖ ఛానల్స్ లోనే బ్యానర్ స్టోరీలుగా రఘురామిరెడ్డి చర్చనీయాంశమవుతున్నారెందుకు..?

తాజా రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఇరకాటంలోకి నెడుతున్నాయా..? ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామాలు నియోకజకవర్గంలో పార్టీకి మైసన్ గా మారుతున్నాయనే వాదనలో నిజ‌ముందా..? భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయా..? భావవ్యక్తీకరణ ద్వారానే ఎంతో రాణిస్తూ కొంత మంది రాజ్యాన్నేలేస్తుంటే… మరికొందరు మాత్రం ఆవిషయాన్ని పసిగట్టలేకో, పసిగట్టినా వారి వైఖరిని మార్చుకోలేకో… ఆ ఏముందిలే అని ప్రధాన్యాతను గుర్తించలేకో… ఇదంతా ఇప్పుడెందుకులే అంటూ అల‌స‌త్వం ప్ర‌దర్శిస్తుండ‌ట వ‌ల్ల‌ ర‌ఘురామిరెడ్డి ర‌క‌రకాల భిన్న‌మైన చ‌ర్చల‌కు తావిస్తున్నారా..?

-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు

వ‌య‌స్సుకు లెక్క‌లు క‌ట్టి ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డికి ముస‌లిత‌నం ఆవ‌హించిందని అంద‌రూ అనుకుంటున్న‌ట్లు ఉంది.. వ‌యస్సు డెబ్బై ఎళ్లైనా శ‌రీరంలో క‌న‌ప‌డ‌దు… అలాగే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల నిర్వాహ‌ణ తీరును చూస్తే వ‌య‌స్సును ప‌సిగ‌ట్ట‌లేము.. వైఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన వైఎస్ఆర్ గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి గ‌డ‌ప ఎక్కేస్తున్నారు.. పొద్దుపొడ‌వ‌క ముందే ప‌ల్లెకు చేరుకుని ప్ర‌తిప్ర‌జ‌ల‌ను క‌లువ‌డం ఈవ‌య‌స్సులో సాధ్య‌మ‌య్యేది కాదు.. వ‌య‌స్సు రీత్యా అసాధ్యంను సాధ్యం చేస్తున్నారు.. ఈ వ‌య‌స్సులో ఎమ్మెల్యే కార్య‌క్ర‌మాల నిర్వ‌హాణ‌లో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న తీరు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సైతం అబ్బుర ప‌డుతూ ఉంటారు.. ఇక రాజ‌కీయ చ‌రిత్ర చూసుకుంటే నాలుగు ద‌శాబ్ధాలు..
మైదుకూరు నియోక‌వ‌ర్గంలో 14 ద‌ఫాలు ఎన్నిక‌లు జ‌రిగితే.. 12 ప‌ర్యాయాలు ర‌ఘురామిరెడ్డి కుటుంబ‌మే పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రంగా చూస్తే అంత చ‌రిత్ర శెట్టిప‌ల్లె కుటుంబంది.. ఇక నియోజ‌వ‌క‌ర్గంలో 8నుండి ప‌దివేల ఓట్లు ఏక‌ప‌క్షంగా అనుకూలత క‌ల్గి ఉన్న రాజ‌కీయ కుటుంబం.. వైసీపీ టిక్కెట్‌ను ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డిని కాద‌ని ..మ‌రోక‌రికి వైఎస్ జ‌గ‌న్ ఇచ్చే ప‌రిస్థితి ఉందా? అంటే అంత‌టి ధీటైన ఆర్థిక బ‌లం, బ‌ల‌గం ఉన్న నాయ‌కుడెవ్వ‌రూ లేరు.. నేను పోటీకి సిద్ద‌మే అని ఇంకే నాయ‌కుడు సంకేతాలు ఇవ్వ‌డం కానీ, ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం కానీ మ‌చ్చుకైనా లేవు. ఇంత రాజ‌కీయ నేప‌థ్యం క‌ల్గిన ర‌ఘురామిరెడ్డికి 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ టిక్కెట్ రాద‌నే ప్ర‌చారం జోరందుకోవ‌డానికి కార‌ణం అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలా వైసీపీ పార్టీలో కొంద‌రు నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే అన్న చ‌ర్చ బ‌లంగా ఉండిపోయింది.

డీఎల్ ర‌వీంద్రారెడ్డిని దూరం పెట్ట‌డ‌మే? ఇందుకు కార‌ణ‌మా?

1985 నుండి 2009 వ‌ర‌కు డీఎల్ ర‌వీంద్రారెడ్డిపై ఆరుప‌ర్యాయాలు పోటీ చేశారు ర‌ఘురామిరెడ్డి. ఎన్నిక‌ల రాజ‌కీయ ర‌ణ‌రంగంలో వీరి మ‌ధ్య ఫ్యాక్ష‌న్ భూతం న‌డిచింది.. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి 2019 ఎన్నిక‌ల్లో డీఎల్ మ‌ద్ద‌తు ర‌ఘురామిరెడ్డి తీసుకోవ‌డం.. నామినేష‌న్ ప్ర‌క్రియలో డీఎల్ భాగ‌స్వామ్యం కావ‌డం జ‌రిగిపోయింది.. వైసీపీ ప్ర‌భుత్వం రావ‌డంలో రాజోలి ఆన‌క‌ట్ట‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చిన సంద‌ర్భంలోనే ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డికి బెడిసికొట్టింది.. మా మ‌ధ్య‌రాజకీయ పోరును వ‌దిలి ఎన్నిక‌ల్లో స‌హ‌కారం అందిస్తే అధికారం వ‌చ్చి రాగానే ప‌క్క‌న పెట్టేయడం వంటి రాజ‌కీయ చ‌ర్య‌లు డీఎల్ లో అగ్ర‌హం తెప్పించ‌డ‌మే కాకుండా.. ర‌ఘురామిరెడ్డిపై వ్య‌తిరేక అస్త్రాలు సంధిస్తున్నారు. ఆ ఆస్త్రాలు కూడా గుక్క తిప్పుకోలేనంత‌.. రాజ‌కీయంగా న‌ష్టం క‌ల్గించే దిశ‌గా ఉండిపోయాయి.. రెండు ధ‌పాలు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండటం వ‌ల్ల‌.. రాజ‌కీయంగా బ‌ల‌హీన ప‌డి ఉండొచ్చు.. అది అంద‌రి విష‌యంలో జ‌రిగేదే? కానీ ఎన్నికల సమయంలో మేమిద్దరం ఓక్కటే అనే సంకేతాలు ఇచ్చి ఆరు నెలల్లో రాజకీయ విభేధాల నేపథ్యంలో దూరం కావడం వల్ల ఎన్నికల్ల ప్రజా తీర్పుకు వెళ్లే రఘురామిరెడ్డికి కొంతలో కొంత వ్యతిరేక పవనాలు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి వినపడుతున్న మాట. నియోజకవర్గంలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రాజకీయపరంగా అణగదొిక్కుతే అదే తరహాలో వ్యతిరేకతో కూడిన మాటలు రఘురామిరెడ్డి ఎదుర్కొవ‌ల‌సి వస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది..

బలమైన సామాజిక వర్గంను విస్మరించినందుకేనా..?

1985 నుండి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు ఎనిమిది ప‌ర్యాయాలు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి పోటీ చేయ‌గా నాలుగు ప‌ర్యాయాలు విజ‌యం సాధించారు. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంకు చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డిపై ఆరు ప‌ర్యాయాలు పోటీ చేస్తే నాలుగు ప‌ర్యాయాలు ర‌ఘురామిరెడ్డి ఓట‌మి చెందారు. దీన్ని బ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు ఓట‌మిలు నిర్ధారించే సామాజిక వ‌ర్గం పెడ‌కంటి రెడ్లు. రెండు ప‌ర్యాయాలు వ‌రుస విజ‌యాలు చేకూర్చుకున్న నేప‌థ్యంలో డీఎల్ వ్య‌తిరేకతతో వారిలో మార్పు కోసం ఓడించాల‌నే ధ్యేయంతో ర‌ఘురామిరెడ్డిని గెలిపించాల్సి వ‌చ్చింద‌నే మాట కూడా పెడ‌కంటి రెడ్ల‌ల్లో విన‌ప‌డుతూ ఉంటుంది. 2014,2019 ఎన్నిక‌ల్లో ఆ సామాజిక వ‌ర్గం నుండి ఎవ్వ‌రూ పోటీ లేని ప‌క్షంలో డీఎల్ త‌ర‌హాలో రెండు వ‌రుస విజ‌యాలు ర‌ఘురామిరెడ్డికి సొంతం చేసి రికార్డు అందించామ‌నే వాద‌న ఈ సామాజిక వ‌ర్గంలో న‌డుస్తోంది.. ఎన్నిక‌ల్లో ఆసామాజిక వ‌ర్గం నుండి పోటీ లేని కార‌ణంగా సునాయాస విజ‌యాలు అందుకున్న ర‌ఘురామిరెడ్డి అధికార ఫ‌లాలు ఆ సామాజిక వ‌ర్గ నేత‌ల‌కు అందించ‌డంలో వెనుక‌బ‌డ్డార‌ని.. ఆకార‌ణంగానే ఆ సామాజిక వ‌ర్గంలోని నేత‌లనుండి వ్య‌తిరేక‌త ను మూట‌గ‌ట్టుగ‌ట్టుకోవ‌డం వ‌ల్లనే బ‌ల‌హీన ఛాయ‌లు నియోజవ‌ర్గంలో అలుముకుంటున్నాయ‌నే వ్యాఖ్య‌లు విన‌ప‌డుతున్నాయి.. అటు ప్ర‌జాక్షేత్రంలో కానీ, ఇటు అధికారిక ఉన్న‌త ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంలో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి వివ‌క్ష‌త చూపుతున్నారంటూ ఆ సామాజిక వ‌ర్గంకు చెందిన కొంద‌రు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు..

దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి లాంటి ఆ సమాజికవర్గ నేతలకు  ఛైర్మ‌న్ ప‌ద‌వులు ఎందుకు కట్టబెట్టలేకపోయారు..?

ఆ సామాజిక‌వ‌ర్గంలో ఇప్పుడు అంద‌రి నోట విన‌ప‌డ‌తున్న మాట దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి పేరు.. వైసీపీ పార్టీ త‌రుపున పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పోటీ చేసిన‌ప్ప‌టికీ నుండి అప్ప‌టి అధికారంను ఏ మాత్రం ఖాత‌రు చేయ‌కుండా ధైర్యంగా ప‌నిచేయ‌గ‌లిగిన నాయ‌కుడు.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంకు చెందిన గంగాధ‌ర్ రెడ్డికి ద‌క్కిన ప‌ద‌వి డైరెక్ట‌ర్ ప‌ద‌వి.. ర‌ఘురామిరెడ్డికి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారికి సైతం నియోజ‌క‌వ‌ర్గంలో డైరెక్ట‌ర్ ప‌ద‌వి ల‌భించాయి.. బి.మ‌ఠంకు చెందిన సుద‌ర్శ‌న‌రెడ్డి సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గంన‌కు చెందిన రెడ్డి. అందుకే ఎమ్మెల్యే అనుమ‌తి లేకుండానే డైరెక్ట‌ర్ ప‌ద‌వి సొంత‌మైంది. గంగాధ‌ర్ రెడ్డి ఏ విలువ‌లేని డైరెక్ట‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతోపాటు.. అదే త‌ర‌హాలో ప‌నిచేసి అకాల మ‌ర‌ణం పొందిన దుగ్గిరెడ్డి వాసు క‌టుంబంకు ఏ ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ నేత‌లంతా బ‌య‌ట‌కు అభిమానం చూపుతున్న‌ట్లు ప్ర‌ద‌ర్శిస్తున్నా.. లోలోపు ర‌గ‌లిపోతున్నారు.. ర‌ఘురామిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యేకు పోటి చేయాల‌నే భావ‌న‌తో ఉండిపోయిన అన్న‌పురెడ్డి శ్రీమ‌న్నారాయ‌ణ‌రెడ్డి లో ప‌ద‌వి విష‌యంలో అదే జ‌రిగింద‌ని.. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పెడ‌కంటి సామాజిక వ‌ర్గంలో బ‌లంగా ఉండిపోయిన కొంద‌రు నేత‌లు ఏ ప‌ద‌వులు ద‌క్కకుండా .. ఇటు రాజ‌కీయంగ ఆణిచివేయ‌బ‌డి అసంతృప్తితో ర‌గ‌లిపోతున్నారంటూ రాజకీయ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న మాట‌. అంతే చివ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్‌కు క‌లిసే విష‌యంలోనూ బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం అణిచివేయ‌బ‌డుతున్న‌ద‌నే వాద‌న బ‌లంగా విన‌ప‌డుతోంది.

మైదుకూరు పుర‌పాలిక‌లో అదే జ‌రుగుతోందా?

అధికారంలో ఉన్న‌ప్పుడు మైదుకూరు పుర‌పాలిక ఛైర్మ‌న్ ప‌ద‌వి ర‌ఘురామిరెడ్డికి ఛాలెంజ్ గా నిలిచింది. తెలుగుదేశం పార్టీకి ఛైర్మ‌న్ గిరి ద‌క్కుతుందని రాజ‌కీయ‌మేధావులు అంచ‌నాను త‌ల్ల‌కిందులు చేస్తూ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కించుకుని పార్టీ అధిష్టానంలో పేరును నిల‌బెట్టుకున్నారు.. వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి విలువ‌ను నిల‌బెట్ట‌డంలో ఛైర్మ‌న్ ప‌ద‌వి కి పోటీ చేసిన మాచ‌నూరు చంద్ర నే కార‌ణ‌మ‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉండిపోయింది. ఏది ధ‌న‌బ‌ల‌మైనా కావొచ్చు.., ప్ర‌జాబ‌ల‌మైనా కావొచ్చు.. అధికార బ‌ల‌మైనా కావొచ్చు.. ఇటీవ‌ల పుర‌పాలిక‌లో అధికారుల పెత్త‌నం ఎక్కువైంద‌ని.. ఛైర్మ‌న్ గా త‌న‌కు ఏ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంటూ ఎమ్మెల్యే తీరుపై ఛైర్మ‌న్ మాచ‌నూరు చంద్ర తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌నే గుస‌గుస‌లు పురపాలిక‌లో విన‌ప‌డుతున్నాయి.. ఛైర్మ‌న్ నిర్ల‌క్ష్యంకు గురవుతున్న నేప‌థ్యంలో ఆ సామాజిక వ‌ర్గం లోని నేత‌లు కూడా అస‌మ్మ‌తిబాట‌లో ఉండిపోయార‌నే విమ‌ర్శ ఉంది.
ర‌ఘురామిరెడ్డిలో ఉన్న భావ‌దారిదర్య‌మే వారి ప‌ట్ల ప్ర‌చారంకు కార‌ణ‌మా. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోవడం.. రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించాల్సిన చోటే .. అది కాస్తా బూమరంగవ్వడం సర్వసాధారణంగా మారిపోతోంది.. అంతేకాదు…కొందరు నాయకులు మాట‌లు .. తీరు అధికార పక్షమా… విపక్షమా అన్న రీతిలో ఉండిపోతున్నాయి. సొంతపార్టీ నేతలనే తెగ అనుమానాలకు గురిచేస్తున్న దుస్థితి. ఈ ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డిని ఇర‌కాటంలోకి నెట్టుతున్నాయి.. ఈ ప‌రిణామాలు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి మైన‌స్ గా మారుతున్నాయ‌ని అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది..