పరీక్షకు ముందే పేపర్ బయటకు వచ్చేస్తే దాన్ని ఏమంటాము? ? ప‌రీక్ష ప్రారంభం త‌ర్వాత పేప‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తే దాన్నిఏమ‌నాలి? ఈ రెండింటికి ఒక‌టే అర్థం లీకేజీ నా..? మ‌రి ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసంకానీ, తేడా కానీ ఉన్న‌ట్లా? లేన‌ట్లే నా?

రిపోర్ట్ ః నందిరెడ్డి నాగ‌శివారెడ్డి

తెలంగాణ‌లో ప‌ద‌వత‌ర‌గ‌తి ప‌రీక్ష ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లో .. త‌ర్వాత రోజు ప్ర‌శ్నాప‌త్రం వాట్సాప్ ద్వారా బ‌య‌ట వ‌చ్చింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బ్ర‌హ్మంగారి మ‌ఠంలో ప‌రీక్ష ప్రారంభ‌మైన గంట ప‌దినిమిషాల‌కు ప్ర‌శ్నాప‌త్రం కాకుండా అందులో ప్ర‌శ్న‌లు, బిట్స్ ఒక కాగితం మీద రాసిపంప‌గా.. వాటి ఆధారంగా ఆన్స‌ర్లు త‌యారు చేసి పంపే కాపీ ఒక ఫోటోస్టాట్ దుకాణంలో వెలుగుచూసింది. ప్ర‌శ్నాప‌త్రం బ‌య‌ట‌కు రాగానే పేప‌ర్ లీకేజీ.. లీకేజీ అంటూ పెద్ద‌ప్ర‌చారమై కూర్చుంటోంది. మీడియా కూడా అదే ధోర‌ణిలో బి.మ‌ఠంలో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ అంటూ క‌థ‌నాలు.. ప్రభుత్వాల వైఫ‌ల్యం అంటూ గ‌గ్గోలు? అధికారగ‌ణం చేత‌గాని త‌నం అంటూ ఏక‌రుపెట్టేశాయి. ప‌ద‌వ త‌ర‌గతి తెలుగు ప్ర‌శ్నాప‌త్రం లీకు అయిందంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద దుమారం.. పేప‌ర్ లీకేజీ వ‌ల్ల ప‌రీక్ష ర‌ద్దు చేయ‌బ‌డి. మ‌ళ్లీ ప‌రీక్ష రాయాల్సి వ‌స్తోందేమో అని రాష్ట్రంలో ప‌ద‌వత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్నల‌క్ష‌లాది మంది విద్యార్ధుల్లో ఒకింత ఆందోళ‌న‌. వారికే కాదు..పేప‌ర్ లీకేజీ వ‌ల్ల తమ విద్యార్ధి న‌ష్ట‌పోతాడేమో అన్న భ‌యం విద్యార్ధుల త‌ల్లిదండ్రుల్లో ఏర్ప‌డింది. ఈ ప్ర‌చారం ప‌రీక్ష రాసే విద్యార్థుల‌తో పాటు, వారి త‌ల్లిదండ్రుల్లో మాన‌సిక ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది..

ప్రశ్నాపత్రం బయటకు రావడంలో విద్యశాఖ వైపల్యమే.. !

కొంత కాలం క్రితం వరకు అత్యంత ప్రబలంగా ఉన్న అన్యాయమైన పద్ధతి వ్యక్తిగత స్థాయిలో లేదా లబ్ధిదారుల భారీ స్థాయిలో కాపీ చేయడం అంటే ఎగ్జానీలు ఈ చర్యలకు వారి తల్లిదండ్రులతో సహా సమాజం యొక్క ఆమోదం ఎప్పుడూ లేనప్పటికీ. కాపీయింగ్‌ను అరికట్టడానికి అన్ని ప్రయత్నాలూ విద్యావేత్తలు, విద్యాసంబంధమైన పాలన మరియు కాపీయింగ్ వద్దు అనే శాసనపరమైన నిబంధనల వంటి నిరోధకాల ద్వారా జరిగాయి. లీకేజీలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణయాలు తీసుకుంది . ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీ మీద సెంటర్ నంబర్, రోల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలేటర్లను ఆదేశించింది. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు భద్రత మధ్య తీసుకువస్తారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లో విడదీస్తారు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరు.
ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో నంబర్‌లు రాయించాలని సూచించింది. సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీకేజీ చర్య పూర్తిగా భిన్నంగా న‌డుస్తోంది. పరీక్షా విధానంలోని కొన్ని లొసుగులు ఆధారం చేసుకుని ప‌రీక్ష సిబ్బందితో .. లబ్దిపొందిన విద్యార్థులతో కుమ్మక్కై అమలవుతోంది. ఆచరణాత్మకంగా.., పరీక్ష ప్రణాళిక, నిర్వహణ యొక్క గొలుసులో కొంత మూలకం ప్రమేయం లేకుండా ప్రశ్నపత్రం ను బ‌య‌ట‌కు పంప‌డం సాధ్యం కాదు… పరీక్షా కేంద్రాల్లో తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రిస్తున్నాలీకులకు అడ్డుకట్ట పడలేదు. ఎప్ప‌టి లాగే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ప్రారంభంలోనే ప్ర‌శ్నాప‌త్రం అడ్డ‌దారుల్లో బ‌య‌ట‌కు వెళ్తుండ‌టాన్ని ప్ర‌భుత్వాన్ని, విద్యాశాఖ‌ను వెంటాడుతూనే ఉంది.

ప‌రీక్ష ప్రారంభంకు ముందే ప్ర‌శ్నప‌త్రం వెలుగుచూస్తే లీకేజీకి ప్ర‌మాణికమా!..

ఏదైనా పరీక్షలో పాల్గొనే సాధారణ దశల క్రమాన్ని అనుసరించి, ప్రశ్న పత్రం (ల) యొక్క గోప్యత ఉల్లంఘన ప్రశ్న పత్రం సెట్టింగు, మోడరేషన్, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రవాణా, నిల్వ మరియు పేపర్ పంపిణీ త‌దిత‌ర ద‌శల్లో ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ సంభవించిన‌ప్పుడు సమాజాన్ని కదిలిస్తుంది.. ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ అయిన‌ట్లు వెలుగుచూస్తే మ‌రో ప్ర‌శ్న‌ప‌త్రంను ప్ర‌భుత్వం సిద్దంచేస్తుంది.. లీకేజీ వ్య‌వ‌హ‌రం వెలుగు చూడ‌ని ప‌క్షంలో ప‌రీక్ష నిర్వ‌హిణ జ‌రిగితే పరీక్షల కోసం కష్టపడి, అలాంటి దుర్ఘటనలతో నిరుత్సాహపరిచే అమాయక విద్యార్థులు ఎదుర్కొనే మాన‌సిక వేద‌న‌.. ఆందోళ‌న‌లు చ‌ల్లార్చ‌లేనిది.. ప‌రీక్ష ప్రారంభంకు ముందేప్ర‌శ్నాప‌త్రం బ‌య‌ట‌కు వెలుగు చూస్తే అది లీకేజీ కి ప్ర‌మాణం.. నిఘంట‌వుల్లో అదే చెబుతోంది..ఆ లీకేజీ వ‌ల్ల విద్యావ్య‌వ‌స్థ శిధిలావ‌స్థ‌లో ఉన్న‌ట్లు సంకేతం..

ప‌రీక్ష ప్రారంభం త‌ర్వాత…

ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత ప్ర‌శ్నప‌త్రం బ‌య‌ట‌కువ‌స్తే ప్ర‌భుత్వంకు విద్యాశాఖ‌కు అప‌వాదు త‌ప్పితే.. ప‌రీక్ష రాసేవిద్యార్ధుల‌కు వ‌చ్చే న‌ష్ట‌మేంట‌నే వాద‌న కూడా ఉంది. ఉద‌యం 9గంట‌ల‌కే విద్యార్ధులు ప‌రీక్ష కేంద్రంలోకి వెళ్తారు.. ప‌రీక్ష రాసేందుకు సిద్ద‌ప‌డ‌తారు.. ఆ స‌మ‌యంకు ముందే ప్ర‌శ్న ప‌త్రం బ‌య‌ట‌కు వ‌స్తే లీకేజీ అంటాము.. ఆ లీకేజీ వ‌ల్ల ప‌రీక్ష‌కు వెళ్లే విద్యార్ధులు ప్ర‌శ్నాప‌త్రంను చూడ‌గ‌లుగుతారు.. ముందే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంలు సిద్దం చేసుకుంటారు.. అది చాలా త‌ప్పిదం తో కూడుకున్న‌ది.. ప‌రీక్ష కేంద్రంలోకి విద్యార్ధులి వెళ్లాక‌.. ప‌రీక్ష కుసిద్ద‌ప‌డిన త‌రుణంలో అడ్డ‌దారుల్లో అది సిబ్బంది కావ‌చ్చు.. అధికారులు కావొచ్చు.. మ‌రెవ్వ‌రైన ప్ర‌శ్నాప‌త్రంను బ‌య‌ట‌కు పంప‌డం జ‌రుగుతుంది.. సెల్‌ఫోన్లు ద్వారా ఆ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆపేప‌ర్ రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రికీ చేరి ఉండొచ్చు.. కానీ, మ‌నం ఇక్క‌డ గ్ర‌హించాల్సినది ఒక‌టుంది.. ప్ర‌శ్నాప‌త్రం మ‌న చేతిలోకి వ‌చ్చింది.. మ‌నం ఆన్ష‌ర్లు సిద్దం చేసుకుంటాం.. మ‌రి పరీక్ష రాసే విద్యార్ధికి ప్ర‌శ్నాప‌త్రం వ‌చ్చిన త‌ర‌హాలో అంద‌రికీ స‌మాధాన ప‌త్రం అంద‌జేయ‌గ‌ల‌మా? చేయ‌లేము.. ఎందుకు అంటే అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో కాఫీయింగ్ సిస్టమ్ ప‌నిచేయదు.. ప‌రీక్షా కేంద్రంలోకి మ‌నం ఆన్ష‌ర్ పేప‌ర్ పంప‌లేన‌ప్పుడు విద్యార్ధుల తండ్రుల చేతిలో ఆన్ష‌ర్ పేప‌ర్ ఉంటే ఉప‌యోగ‌మేమి? ప‌రీక్ష కేంద్రం వ‌ద్ద‌ప‌హారా కాసే పోలీసు సిబ్బంది కానీ, ప‌రీక్ష కేంద్ర‌నిర్వ‌హ‌కుడు కానీ, ప‌రీక్ష ప‌ర్య‌వేక్షించే ఇన్విజిలేట‌ర్ కానీ కాఫీయింగ్‌కు ప్రోత్సయించిన‌ప్పుడు ఇలాంటి ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.. విద్యాశాఖ అధికారులు కానీ, ఇన్విజిలేట‌ర్లు , పోలీసు సిబ్బంది క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత ల‌క్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు బ‌య‌ట‌కు వ‌చ్చినా ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌ని విద్యా మేధావుల్లో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బి.మ‌ఠంలో తెలుగు ప‌రీక్ష ప్రారంభ‌మైన గంట త‌ర్వాత వెలుగు చూసింది ప్ర‌శ్నాప‌త్రం కూడా కాదు.. పేప‌ర్ లో రాసిన ప్ర‌శ్న‌లు, దానికి స‌మాధానాలు.. లీకేజీ అంటూ గ‌గ్గోలు .. అధికారుల్లో గుబులు త‌ప్ప చివ‌రికి య‌ధావిధిగాప‌రీక్ష‌లు జ‌రిగిపోయాయి. బి.మ‌ఠంలో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్షా ప‌త్రం లీకేజీ అంటూ వ‌చ్చిన క‌థ‌నాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ స్పందించి..ఇది లీకేజీ కాదు… ప‌రీక్షా కేంద్రం నుండి ప్ర‌శ్న‌ప‌త్రం బ‌య‌ట‌కు రావ‌డం.. లీకేజీకి, పేప‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంకు చాలా తేడా ఉంద‌ని వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం..

లీకేజీ గ‌గ్గోలుపై విద్యాశాఖ పోలీసులు క‌స‌ర‌త్తు..

బి.మ‌ఠంలో ని ఓ పోటోస్టాట్ సెంట‌ర్ వ‌ద్ద పేప‌ర్లో వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు ఆధారంగా త‌యారు చేసిన ఆన్ష‌ర్ పేప‌ర్ కాఫీ వ్య‌వ‌హారం గురించి మిడియా గ‌గ్గోలు పెట్టింది. ఆ గ‌గ్గోలు కూడా ప‌రీక్ష ప్రారంభమైన గంట ప‌దినిమిషాల‌కు,.. ఈ త‌తంగంపై ప్ర‌భుత్వంతోపాటు, విద్యాశాఖ అల‌ర్టైంది.. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష నిర్వ‌హ‌ణ అధికారి వెంకటకృష్ణారెడ్డి, మైదుకూరు రూర‌ల్ సీఐ న‌రేంద్ర‌రెడ్డి, విద్యాశాఖ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు..
‘‘ సోమవారం జరిగినటువంటి తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవం కాదు..ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలకుసంబంధించి కొన్ని సమాధానాలు జిరాక్స్ సెంటర్ నందు జిరాక్స్ కోసం వెళ్లినటువంటి వ్యక్తి దగ్గర లభ్యమైంది.. ప్రశ్నా పత్రం ఎవ్వరిచేతుల్లోకి వెళ్లింది.. ఇందులోని ప్రశ్నలు ఒక కాగితంలోకి రాసి పంపిందేవ్వరు.. ఫోటో స్టాట్ సెంటర్ వద్దకు ఆన్షర్ పేపరు ఎవ్వరు తెచ్చారు అనే కోణంలో దీనిపై పూర్తివిచారణ చేపడుతున్నాము. ఇది పేపర్ లీకేజి కాదు.. పరీక్ష జరిగిన గంట తర్వాత కొందరు చేసిను దురాగతంలో ప్రశ్నలు, బిట్స్ బయటకు వచ్చాయి..దీనిపై
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ ’’ ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష నిర్వ‌హ‌ణ అధికారి వెంకటకృష్ణారెడ్డి, మైదుకూరు రూర‌ల్ సీఐ న‌రేంద్ర‌రెడ్డి స్పష్టంచేశారు.