ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి మ‌దిలో ఆ ఆలోచ‌న ఉన్న‌ట్లేనా..?
తెలుగుదేశం ప్ర‌భుత్వ త‌ర‌హాలో మైదుకూరుకు ఆప్రాధాన్య‌త లభిస్తుందా?
టీటీడీ డైరెక్ట‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే విష‌యంలో ర‌ఘురామిరెడ్డికి వైసీపీ పెద్ద‌ల అండ‌దండ‌లు ల‌భించేనా?
ఇంత‌కీ టీటీడీ పాల‌క‌వర్గంలో మ‌ళ్లీ చోటు ల‌భించే అవ‌కాశ‌ముందా?

మైదుకూరుకు టీటీడీ ప‌ద‌వి ద‌క్కితే.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశీస్సులు ఎవ్వ‌రికి ల‌భిస్తాయి? ఆ ప‌ద‌వి ఆశిస్తున్న మైదుకూరు ప్రాంత నేత‌లెవ్వ‌రూ? ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి ఎవ్వ‌రికీ ప్రాధాన్య‌త నిస్తారు? అనే అంశంపై ఎవ్వరి లెక్కలు వారు.. ఎవ్వరి అంచనాలు వారు వేసుకుంటూ గుసలులాడుతున్నారు.. తెలుగుదేశం ప్రభుత్వ తరహాలో ఈ చివరి ఏడాదిలో ఎంతో ప్రాధాన్యత కల్గిన.. కీలకమైన తిరుమల తిరుపతి దేవస్దానం పాలకవర్గంలో చోటు మైదుకూరు దక్కే విషయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు వైసీపీ అధిష్టానం తో మొదలు పెట్టారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.. ఏది ఏమైనా మైదుకూరుకు టీటీడీ పాలకవర్గంలో చోటు కల్పించే విషయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రయత్నాలు చేయవచ్చు.. ఆ దిశగా రాజకీయ చతురత ను ప్రదర్శిస్తూ ఉండవచ్చు.. అందులో సందేహించాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో మైదుకూరుకు నాలుగేళ్లు పాలక వర్గంలో చోటు లభించింది. డైరెక్టర్ తోపాటు.. ఛైర్మన్ పదవి కూడా వరసుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టబెట్టారు. మైదుకూరుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అదే తరహాలో టీటీడీ పాలకవర్గంలో మైదుకూరుకు వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘరామిరెడ్డి బలంగా ఉండొచ్చు.. ఉండి తీరవచ్చు.. మైదుకూరులోొ వస్తున్న ప్రచారంలో భాగంగా రానున్న టీటీడీ పాలకవర్గంలో మైదుకూరుకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండవచ్చు.. అందుకేనేమో టీటీడీ డైరెక్టర్ పదవి మైదుకూరుకు దక్కబోతోంది? అనే ప్ర‌చారంలో నిజ‌ముండొచ్చు అనే వాద‌న కూడా ఉంది. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో డైరెక్ట‌ర్‌, ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కిన‌ప్పుడు క‌నీసం డైరెక్ట‌ర్ ప‌ద‌వైనా ఎందుకు రాదు? అదేదిశ‌గా ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న రాజ‌కీయ మేధావులుతో పాటు.. వైసీపీ పార్టీలోని అధినాయ‌కులు గ‌ట్టిగా వినిపిస్తున్నారు కూడా.. మ‌రో కొద్ది నెల‌లో ఏర్ప‌డ‌బోయే టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో మైదుకూరుకి ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌నే ధీమా కూడా కొంద‌రిలో వ్య‌క్త‌మవుతోంది. టీటీడీ పాలకవర్గంలో మైదుకూరుకు సముచిత స్ధానం కల్పించే విషయంలో అధిష్టానవర్గంపై ఎమ్మెల్యే వత్తిడి తెస్తున్నారా? లేదా అన్న‌ది ర‌ఘురామిరెడ్డికే ఏరుక‌..

తెలుగుదేశం పాల‌న త‌ర‌హాలో వైసీపీ పాల‌న‌లో చివ‌రి ఏడాదిలో ఎట్ట‌కేల‌కు మైదుకూరుకు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవ‌కాశం క‌ల్పిస్తే.. ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి ఎవ్వ‌రికీ ప్రాధాన్య‌త నిస్తారు? ఎన్నిక‌లు స‌మీస్తున్న త‌రుణంలో ఈ ప‌ద‌వికి ఎవ్వ‌రికీ క‌ట్ట‌బెడ‌తార‌నే ఉహ‌గానాలు విన‌ప‌డుతున్నాయి.. కొంద‌రు చ‌ర్చ‌లేవ‌నెత్తున్నారు.
వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి ప్ర‌ధాన భూమిక పోషించ‌డ‌మే కాకుండా.. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ అధికార ఆగ‌డాల‌ను అడ్డుకుని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎంపీగా గెలిపించ‌డంలోనూ.. పార్టీని అధికారంలోకి తెప్పించి ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డిని రెండు ప‌ర్యాయాలు గెలుపును సునాయాసం చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌.. వ్య‌వ‌హ‌రిస్తున్న నాయ‌కుల‌ను సేవ‌ల‌ను గుర్తెరిగి టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో సముచిత స్ధానం క‌ల్పిస్తే రానున్న ఎన్నిక‌ల్లోనూ వైసీపీ పార్టీకే కాదు.. ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి కి తిరుగుండ‌ద‌నే వాద‌న గ‌ట్టిగా విన‌ప‌డుతోంది.

ఓట్లు ఒక‌రివి.. అధికార‌పెత్త‌నం మ‌రోక‌రిదా?

ఇటీవల కాలంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఒక‌ బ‌ల‌మైన వ‌ర్గం నుండి బ‌ల‌మైన వాద‌న గ‌ట్టి వినిపిస్తున్న‌దేమిటంటే..? @@ ఓట్లు మావి.. గెలిపించేది మేము.. అధికార ఫ‌లాలు.. రాజ‌కీయ ప‌ద‌వులు.. ప్ర‌జాప్ర‌తినిధులుగా అంద‌లమెక్కేది ఇత‌ర రెడ్డి కుల‌స్ధులా? అన్న‌ది. ఈ వాద‌న కూడా పెద‌వుల మాటున కాదు.. చాలా గ‌ట్టిగా. మింగుడు ప‌డ‌లేన్నంత‌గా. చెవులు ధ్వ‌నించేలా? అంతే కాదు మా సామాజిక వ‌ర్గం నేత‌లు ప్ర‌జాక్షేత్రంలోకి రాకుండా అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్న‌మే అంటూ ఘంటాప‌థంగా చెబుతున్నారు.. వాద‌న‌ల‌కు దిగుతున్నారు..
వైసీపీ పార్టీ ఆవిర్బావం నుండి నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌ల‌మైన రెడ్డి ( పెడ‌కంటి) వ‌ర్గం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికిఅండ‌గా నిలుస్తుంది.. 2014,2019 ఎన్నిక‌ల్లో మైదుకూరులో వైసీపీ పార్టీ త‌రుపున ర‌ఘురామిరెడ్డి పోటీచేస్తే వ‌రుస విజ‌యాలు అందించారు.. ర‌ఘురామిరెడ్డికి గొప్ప రికార్డు అందించ‌డంలో పెడ‌కంటి రెడ్లు కీల‌క‌మ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన న‌గ్న‌స‌త్యం.. మ‌రి అధికారంలోకి వ‌చ్చాక త‌మ‌ వ‌ర్గం రాజ‌కీయంగా వివ‌క్ష‌త‌కు గుర‌వుతున్న‌ద‌ని గ‌ట్టిగా పెడ‌కంటి రెడ్లు వాదిస్తున్నారు.. విమ‌ర్శ‌ల‌కు సైతం బాహాటంగా తెగ‌ప‌డుతున్నారు.

వైసీపీ పార్టీ ఆరంభం నుండి రెడ్ల వ‌ర్గంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంకు చెందిన వారిలో ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకునే వారిలో ఇర‌గంరెడ్డి తిరుపాలురెడ్డి, దుగ్గిరెడ్డి గంగాధ‌ర్‌రెడ్డి, దుగ్గిరెడ్డి వాసు, ఈవీ మ‌హేశ్వ‌ర‌రెడ్డి, శ్రీమన్నానారాయ‌ణ‌రెడ్డి, ఇర‌గంరెడ్డి శంక‌ర్‌రెడ్డి త‌దిత‌రులున్నారు… వీరే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ముంద‌స్తుగా ప‌నిచేశారు. ఎంపీగా జ‌గ‌న్ పోటీ చేసిన‌ప్పుడు ప్రాణాలు తెగించి ప‌నిచేశారు.. తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో కి ర‌ఘురామిరెడ్డి చేరిన త‌ర్వాత అదే త‌ర‌హాలో ప‌నిచేశారు.. రెండు ద‌ఫాలు విజ‌యంకూడా ర‌ఘురామిరెడ్డి కి అందించ‌డ‌మే కాదు.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంకు చెందిన రెడ్లంతా ప‌నిచేశారు.. వ‌రుస విజ‌యాలు అందించి ర‌ఘురామిరెడ్డి చరిత్ర‌ను తిర‌గ‌రాయించ‌డంలో ఈ సామాజిక‌వ‌ర్గ రెడ్లు ప‌డిన శ్ర‌మ అంతా ఇంతా కాద‌నే వాద‌న ఆ సామాజిక వ‌ర్గ నేత‌ల్లో వ్య‌క్త‌మవుతోంది.

రెడ్ల వ‌ర్గంలోని బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం నేత‌లైన ఇర‌గంరెడ్డి తిరుపాలురెడ్డికి, దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డికి, శ్రీమ‌న్నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టామ‌నే భ‌రోసా ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డిలో ఉండొచ్చు.. ఇర‌గంరెడ్డి తిరుపాలురెడ్డి ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ మోహ‌న్‌రెడ్డికి బంధువు.. ఆ బంధుత్వ ఫ‌లితంగానే రాష్ట్ర ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.. దుగ్గిరెడ్డి వాసు కుటుంబంకు రాజ‌కీయంగా ఎలాంటి ప్రాధాన్య‌త దొర‌క‌లేద‌నే విమ‌ర్శ ఉండిపోయింది. ఇక దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుండి ప‌నిచేస్తూ వ‌స్తున్నారు.. పార్టీ ఏర్పాటు త‌ర్వాత గంగాధ‌ర్ రెడ్డి అవ‌స‌రంను గుర్తించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక వాహ‌నం ఇవ్వ‌డ‌మే కాకుండా రాజ‌కీయంగా వినియోగించుకున్నారు..

అధికారం వ‌చ్చాక కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గిరి ల‌భిస్తుంద‌నే ధీమా వైసీపీ పార్టీలోనే కాకుండా,బ‌ల‌మైన రెడ్ల సామాజిక‌వర్గ మంతా ఆశించింది. ఆ ఆశ అడియాశే అయింది. గంగాధ‌ర్ రెడ్డి కి ప్ర‌భుత్వంలో స‌ముచిత స్ధానం ల‌భించ‌లేద‌నే అక్క‌సు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ నేత‌ల నుండి ఆ స‌మ‌యంలో వ్య‌క్త‌మైంది. ప్ర‌జా క్షేత్రంలో ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొనిప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నిక కావాల‌ని దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డితోపాటు, అన్న‌పురెడ్డి శ్రీమ‌న్నారాయ‌ణ‌రెడ్డిలు చేసిన‌ప్ర‌య‌త్నమంటూ లేదు.. ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో నిలిచే అవ‌కాశం కూడా రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల కోల్పోయార‌నే వాద‌న‌లో ఆ సామాజిక‌వ‌ర్గంలో బ‌లంగా వినిపిస్తోంది. ఛైర్మ‌న్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించిన గంగాధ‌ర్‌రెడ్డి చివ‌ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేని డైరెక్ట‌ర్ ప‌ద‌వితో స‌రిపెట్టుకోవ‌ల్సిన నేప‌థ్యంలో స్వంత సామాజిక వ‌ర్గంనుండే కాకుండా, వైసీపీ పార్టీ నేత‌ల నుండి చీద‌రింపుల‌కు గురికావ‌ల్సి వ‌చ్చింద‌నే ప్ర‌చారం ఉంది., ఇక పురపాలిక ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఎన్నిక కావాల‌నే తలంపుతో ప‌ద‌వుల‌కు సైతం రాజీనామా చేసి చివ‌ర‌కు రెడ్డి సామాజిక వ‌ర్గంలోని కొంద‌రు రెడ్లు నెరిపిన రాజ‌కీయం పావుగా మిగిలిపోయారు.. ర‌ఘురామిరెడ్డి అంటే అభిమానంలో ముందుండే శ్రీమ‌న్నారాయ‌ణ‌రెడ్డి చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండిపోయారు..
ఛైర్మ‌న్ ఎన్నిక‌లో చేసిన త్యాగంకు పార్టీలో స‌రైన గుర్తింపుతోపాటు స‌ముచిత స్ధానం ఉంటుంద‌ని వారిసొంత సామాజిక‌వ‌ర్గ రెడ్లు ఆశించారు..అయితే వ్యవ‌సాయ మార్కెట్‌క‌మిటీ ప‌ద‌వి ల‌భించిన‌ప్ప‌టికీ పేడ‌కాలు ఎత్తే ఫోస్టు అంటూ ఆ రెడ్ల నుండి శ్రీమ‌న్నారాయ‌ణ‌రెడ్డి విమ‌ర్శ‌ను మూట‌గ‌ట్టుకున్నార‌నే విమ‌ర్శ ఉంది. ఇక దువ్వూరు మండ‌లంకు చెందిన ఇర‌గంరెడ్డి శంక‌ర్‌రెడ్డి కూడా రెడ్ల సామాజిక వ‌ర్గ వివ‌క్ష‌త ఫ‌లితంగా ప్రభుత్వ ప‌ద‌వి నోచుకోలేక పోయాడ‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంది. అలాగే మ‌రో బ‌ల‌మైన రెడ్ల కులం చెందిన ఈవీ మహేశ్వరరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి విధేయుడుగా పనిచేశారు.. .జగన్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా పనిచేశారు.. పార్టీ అదికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా నెట్టి వేయబడ్డారు. ఏది ఏమైనా రెడ్ల కులంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంకు రాజ‌కీయ వివ‌క్ష‌త‌కు గుర‌వుతుంద‌నే వాద‌న బ‌లంగా ఉంది.

త‌న విజ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించె బ‌ల‌మైన సామాజిక‌రెడ్ల నుండి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను ఇప్ప‌టికైనా ప‌సిగ‌ట్టి స‌ముచిత స్ధానం అందించంలో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ప్ర‌ధాన భూమిక‌పోషిస్తార‌నే ఆశ కూడా ఆ సామాజిక వ‌ర్గ రెడ్ల నేత‌ల్లో ఉండిపోయింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానం పాల‌క‌వ‌ర్గంలో మైదుకూరుకు ప్రాతినిధ్యం ల‌భిస్తే నియోజ‌క‌ర్గంలో కీల‌కంగా ఉన్న‌బ‌ల‌మైన సామాజిక రెడ్ల‌కు ప్రాధాన్య‌త ఉండేలా చూడాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ నేత‌ల అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2024 ఎన్నిక‌ల్లో త‌న గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌రించే బ‌ల‌మైన రెడ్ల వ‌ర్గంను ఏమేర అక్కున చేర్చుకుంటారే వేచిచూడాల్సి ఉంటుంది.