విగ్రహాలను పునః ప్రతిష్టించిన ఎమ్మెల్యే ‘‘పుట్టాసుధాకర్ యాదవ్’’
-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
మైదుకూరులో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయులు ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్రతిష్ట చేసిన ఘనత ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్కు దక్కింది.. 16 ఏళ్ల కిందట వారి వారి అభిమానుల చేతప్రతిష్టించబడిన ఈ జాతీయనేతల విగ్రహాలను పునః ప్రతిష్టించి ఆ నేతల పట్ల తనకున్నభక్తి భావంతో పాటు, అభిమానంను పుట్టా సుధాకర్ యాదవ్ చాటుకున్నారు.. నాలుగు రోడ్ల సెంటర్ లో శ్రీకృష్ణదేవరాయలు, బద్వేల్ రోడ్డులోని మార్కెట్ కూడిలో పొట్టిశ్రీరాములు, ఆర్టీసీబస్తాండ్ ఎదురుగా మండల కాంప్లెక్ ముందు వైపున బీఆర్ అంబేద్కర్, సాయినాథపురం కూడలో యోగి వేమన దశాబ్ధమున్నర కాలంగా దిక్కుముక్కు లేని దీనస్థితిలో ఉండిపోయారు. వీరి ఆలనా పాలనా ఏ పాలకుడు పట్టించుకున్నదాఖలాలు లేవు.. చివరకు ఆ జాతీయ నేతల విగ్రహాలు నెలకొల్పుకున్న ఆయా సామాజిక వర్గాల నేతలు, వ్యక్తులు, సంఘాలు జయంతి, వర్ధంతి రోజు పూల దండ వేసి కొద్దో గొప్పో నివాళిలు అర్పించే సంస్కృతి ఉండిపోయింది.. పాలకవర్గాలనేతల మాత్రం పర్లాంగు లో దూరంలో ఉండిపోతూ వచ్చారు.. ఫలితంగా ఈ దశాబ్ధన్నర కాలంలో జాతీయనేతలు మసక పట్టి ఎందుకు మాకు గతి అనేట్లు నిర్జీవంగా ఉండిపోయారు.. తమకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు, కార్యకర్తలకు రాజ్యాంగకర్త బీఆర్ అంబేద్కర్ విగ్రహం గుర్తు వచ్చేది.. మిగతా కాలంలో మైదుకూరులో బీఆర్ అంబేద్కర్ అనే విగ్రహం ఒక్కటుంది అనే ఆలోచన కూడా పాలకులకు వచ్చేది కాదు..
ఆరునెలల కిందటే ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారం అందిపుచ్చుకున్న పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టి మైదుకూరులో దిక్కుమొక్కు లేకుండా నీర్జీవంగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయులు ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్రతిష్టించాలనే ఆలోచన తట్టింది.. ఆలోచన తట్టగానే అందరకీ ఆదర్శంగా జాతీయ నేతల విగ్రహాలను తిరిగి ప్రతిష్టించి అందరకీ ఆదర్శంగా ఉండేలా ఒక ప్రణాళిక సిద్దం చేశారు.. రెండు నెలల కిందటి నుండి జాతీయ నేతలవిగ్రహాలను మార్చేదిశగా పావులు కదిపారు. గత జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ని అక్టోబర్ నెలలో కలసి విగ్రహాల ఏర్పాటు, ప్లాట్ ఫాం, నాలుగు రోడ్ల కూడలి సుందరీ కరణ, ప్రొద్దుటూరు_ బద్వేల్ రోడ్డు విద్యుద్దీకరణ పనులు కొరకు డీఎంఎఫ్ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరడం.. అందుకు కలెక్టర్ శివశంకర్ అంగీకరించడం జరిగిపోయాయి. సంక్రాంతి పర్వదినమన
శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాన్ని, రిప్లబిక్ డే రోజుకు బీఆర్ అంబేద్కర్, పొట్టిశ్రీరాములు, యోగి వేమన విగ్రహాలు ప్రతిష్టించాలనే ఒక లక్ష్యం మేరకు ఆఘమేఘాల మీద తమ అనుచరులను భాగస్వామం చేసి ఎమ్మెల్యే ఎట్టకేలకు పునఃప్రతిష్టింపచేశారు.. చరిత్రిలో మరిచిపోలేని విధంగా జాతీయ నేతలకు ఘనమైన నివాళులు అర్పించి తన మార్కు పాలన రుచిచూపించారు..
ఎన్టీఆర్ జయంతి రోజుకు విగ్రహప్రతిష్టకు ప్రణాళికలో ‘‘పుట్టా’’…
తెలుగుదేశం వ్యవస్ధాపకుడు ‘‘నందమూరి ఎన్టీరామారావు’’ తన రాజకీయ జీవితంలో మైదుకూరులో చోటు లేదనే చెప్పాలి.. 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెప్పించి అధికారఫలాలు అందించిన ఎన్టీఆర్ విగ్రహంను మైదుకూరులో నెలకొల్పే విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిర్లక్షంగా వ్యవహరించిందనే చెప్పొచ్చు.. 1983,85,1994,99, 2014 అధికారంలో తెలుగుదేశంపార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన నేతల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న సామాజిక స్పృహ లోపించదనే చెప్పొచ్చు.. ఎమ్మెల్యేగా మొదటి విజయం సాధించిన పుట్టాసుధాకర్ యాదవ్ కు ఎన్టీఆర్ బాగా స్మరణకు వచ్చినట్లు ఉంది.. జాతీయ నేతల విగ్రహాలను పునః ప్రతిష్ట నేపథ్యంలో ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు దీటుగా ఎన్టీఆర్ క్యాంస విగ్రహంను ఏర్పాటు చేయాలని ఒక దృఢనిర్ణయం తీసుకున్నట్లు ఉంది.. ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మండల కాంప్లెక్ ఆవరణంలో భారీ స్ధాయిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక పూర్తయినట్లు సమాచారం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మేనెలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భావించడమే కాకుండా.. ఎన్టీఆర్ మనమడు నారాలోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ప్రతిష్ట తెలుగు తమ్ముళ్లలో ఒక జోష్ ను నింపుతుందని.. మైదుకూరులో ఎన్టీఆర్ ను ప్రతి నిత్యంచూసే సువర్ణావకాశం లభిస్తుందనే ఆశా భావం వ్యకమవుతోంది…
జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటు వెనుక ‘‘ కథ ’’..
అది 2008 సంవత్సరం చివరి నెలలు.. ఆ సమయంలో ఉద్యమాల కూడలిగా పేరున్న మైదుకూరు నాలుగు రోడ్ల సెంటర్ లో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహం ఆఘమేఘాల మీద ఆళ్లగడ్డ నుండి తెప్పించి ( కృష్ణదేవరాయులు సామాజిక వర్గంగా చెప్పుకునే యువకులు కొందరు) అందరూ అదమరిచి నిద్రిస్తున్న వేళ ప్రతిష్టించారు.. నాలుగు రోడ్ల కూడలిని శ్రీకృష్ణదేవరాయులు సెంటర్ గా పేరు మార్చుకున్నారు.. అదే సమయంలో దళిత సంఘాలు తమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహంను మండల కార్యాలయ కాంప్లెక్ ఆవరణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి.. బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆందోళనలు, నిరసనలు చేస్తూ వస్తున్నారు.. అదే తరుణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంను బద్వేల్ రోడ్డు నందు గల మార్కెట్ కూడలిలో శ్రీరాములు సామాజిక వర్గంకు చెందిన స్ధానికులు కొందరి సహకారంలో అర్థరాత్రి బొమ్మను పెట్టేశారు.. ఇక వేమారెడ్డి సామాజిక వర్గంకు చెందిన నాయకులు, మేధావులు కడపరోడ్డు లోని సాయినాథపురం సెంటర్ ఎంపిక చేసుకుని యోగి వేమన విగ్రహంను రాత్రి రాత్రికి ఏర్పాటు చేసేశారు.. చివరకు జాతీయనాయకులకు కులంరంగు పూచిసెంటర్లను ఎవ్వరికీ వారు ఏర్పాటు చేసుకున్నారు.. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న జాతీయ నేతల విగ్రహాలకు 16 ఏళ్లు కాలం గడిచింది. జాతీయ నెతల్లో పొట్టిశ్రీరాములు, వేమన విగ్రహాల పూర్తి అనాధరణకు గురయ్యారు… ఎట్టకేలకు ఎమ్మెల్యే గా ఎన్నికై అధికారం చేజిక్కించుకున్న ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ జాతీయ నేతలను గుర్తించారు.. ప్రభుత్వ నిధులతో భావితరాలు మరిచిపోని విధంగా నేతల విగ్రహాలను పునః ప్రతిష్టించి ప్రాణం పోశారని చెప్పడం అతియోశక్తి కాదని నాభావన.. మైదుకూరులో జాతీయనేతలకు మరింత గుర్తింపు తీసుకువచ్చి.. అధికార హోదా కల్పించడమే కాకుండా .. ప్రభుత్వ విధానంలో భాగస్వాములను చేయడం లో ప్రముఖ పాత్ర పోషించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పనితీరును అందరం మెచ్చుకోవాల్సిందే… మెచ్చుకొని తీరాల్సిందే కదా