* రిపబ్లిక్ డే సందర్భంగా ఓ మధుర ఘట్టం..
*ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా..
*బీ ఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, యోగి వేమన విగ్రహాలు పునః ప్రతిష్ట..
నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
మైదుకూరులో ఓ ప్రధాన ఘట్టం ఆవిష్కరించబడుతోంది.. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని ఈ ఘట్టం ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ చేతుల మీదుగా జరగబోతోంది.. జాతీయ పతాకం చూస్తే చాలు ప్రతి భారతీయ పౌరుడి హృదయం స్పందిస్తుంది.. శరీరం పులకిస్తుంది.. మనసు పరవశిస్తుంది..
‘‘ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి.. మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే ఈపతాకానికి ప్రాణం పోసింది మన తెలుగువాడే. ఆయనే కృష్ణా జిల్లాకు చెందినపింగళి వెంకయ్య’’ ఎంతో ప్రాధాన్యత కల్గిన జాతీయపతాకాన్ని 101 అడుగు ఎత్తులో జాతీయపతాకం మనగడ్డపై.. మన మైదుకూరు నడిబొడ్డున రెపరెపలాడటానికి ప్రధానసూత్రదారి ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ అనడంలో సందేహం అవసరం లేదు.. పురపాలిక సంఘం సహకారంతో, సూర్యలైన్స్ హైదరాబాద్ సాంకేతిక సహకారంతో, తెలుగుదేశం నాయకులు ఏపీ రవీంద్ర ఆధ్వర్యంలో మైదుకూరు నడిబోడ్డున రాయల్ కూడలిలో రూ16లక్షల వ్యయంతో ఈ భారీ జెండాను తీర్చిదిద్దారు.. రెండు టన్నుల బరువైన జెండా పోల్ పై 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంది.. సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తూ దేశ ఔన్నత్యం, మైదుకూరు ఘనకీర్తిని చాటనుంది. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనవరి 26న (రేపు) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పతాకాన్నిా ఆవిష్కరించనున్నారు.
. శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ చాలా విషయాల్లో తమ మైదుకూరును అద్వితీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని మైదుకూరుకు రప్పించి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసి.. మైదుకూరు గురించి అందరూ మాట్లాడుకునే అంశాలు ఉండాలని, .జిల్లాతో పాటు రాష్ట్రం కూడా మైదుకూరు వైపు చూడాలని శాసనసభ్యులుగా పుట్టా కలగనడంలో తప్పేమీలేదు. అందుకు ఆచరణలో ఆయన రకరకాల పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా మైదుకూరులో అత్యంత ఎత్తయిన, అతి పెద్ద జాతీయ పతాకాన్నిమైదుకూరులో ఏర్పాటు చేయడానికి పుట్టా సుధాకర్ యాదవ్ నిర్ణయించడం ఇలాంటి నిర్ణయాల కోవలోకే వస్తుంది.
అతిపెద్ద జాతీయపతాకం ను మైదుకూరు కూడలిలో శ్రీ కృష్ణదేవరాయులు స్థూపం వద్దనే ఏర్పాటుచేయబోతున్నారు. తన మైదుకూరు రాష్ట్రంలోనే ‘నెంబర్వన్’గా ఉండాలనుకునే పుట్టా తపనకు తపనకు ఇది నిదర్శనం కావొచ్చు. ఇప్పటికే మైదుకూరులో శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించి తన చేతుల మీదుగానే ప్రారంభించి.. మైదుకూరు పుర ప్రజలకు అంకితం చేశారు.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మైదుకూరులో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్రతిష్ట చేస్తున్నారు.
. ప్రగతి దిశగా మైదుకూరును సృష్టించడంలో తనదైన ముద్ర కోసం పుట్టా సుధాకర్ యాదవ్ తహతహ లాడుతున్నారనడానికి జాతీయనాయకుల విగ్రహాల పునః ప్రతిష్ట ఇందుకు చక్కటి తార్కాణం.. అతిపెద్ద పతాకాన్ని మైదుకూరులో ఏర్పాటు చేయడం వల్ల మన ప్రాంత ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేయడానికి దోహదపడుతుందనే భావనతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అనడం విశేషం. ఈభారీ పతాకాన్ని రిపబ్లిక్ దినోత్పవం సందర్భంగా జనవరి 26 (ఆదివారం ) శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించబోతుండటం ఓ మధుర ఘట్టంగా భావించవచ్చు..