కడప పార్లమెంట్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియప్రారంభం నుండి మంత్రి హోదాలో డీఎల్ కాంగ్రెస్ పార్టీ తరుపునపోటీ చేస్తుండటంతో వైసీపీ పార్టీ అధినాయకత్వం మైదుకూరు నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టింది.. ఎంతగా అంటే డీఎల్ కదలికలపై పూర్తి స్ధాయి నిఘా పెట్టింది.. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు.. మైదుకూరు నియోజకవర్గం ఒక ఎత్తు అనేలా.. అటు పార్టీ పరంగానే కాకుండా సాక్షి యజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. డీఎల్ పై వ్యతిరేక కథనాలు అందించే విషయంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసింది.. ఈడెస్క్ కు వార్తా కథనాలు అందించే బాధ్యత నాపై పెట్టింది.. ఢిల్లీ కి కడపకు పోటీ అనే నినాదంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో నేను కూడా నావంతుగా మైదుకూరు నియోజకవర్గంలో సహకారం అందించాను. నా ప్రాణాన్ని పణ్ణంగా పెట్టి వార్తలతోపాటు.. డీఎల్ కు షాడో గా వ్యవహరిస్తూ అటు పార్టీ.. ఇటు సాక్షి యజమాన్యం నాకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చా..
– నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
ఎన్నికలకు సాక్షి ప్రత్యేక టీం..
మైదుకూరు నియోజకవర్గం పై సాక్షి యాజమాన్యం దృష్టి పెట్టిన నేపథ్యంలో డీఎల్ పై ఎప్పటికప్పుడు డేగ కన్నుతో వార్తలు అందించే క్రమంలో ప్రత్యేక టీం ఏర్పాటుచేసింది.. టీం మైదుకూరులో ఉండే విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా సంగన కిషోర్ రెడ్డి సర్వాయపల్లె రోడ్డులో తన ఇంటిని ఇచ్చేశారు.. ఇకపర్నీచర్ ను మైదుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న శెట్టిపల్లెరఘురామిరెడ్డిని అడగమని నన్ను ఆదేశించారు.. అదే మాట రఘురామిరెడ్డి వర్గీయులకు చేరవేచా.. సంగన కిషోర్ రెడ్డి ఇచ్చిన రూమ్ లో పర్నిచర్ ఏర్పాటు చేయించారు. ఒంగోలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులుతోపాటు, విజయవాడ, గుంతకల్, కర్నూలు, నంద్యాల తదితర సెంటర్ల నుండి పది మంది వరకు సాక్షి రిపోర్టర్లను మైదుకూరుకు పంపించారు..అందరూ నియోజకవర్గంకు కొత్తవారే..నేనే అందరికీ సుపరిచితుడను..
వీరి నిర్వహాణ బాధ్యతను నాకు అప్పగిస్తూ ఖర్చుల కింద 10వేలు ఇచ్చి నాతో సంతకం తీసుకున్నారు కడప సాక్షి రిపోర్టర్. ఎన్నికల సమాచారం అందుకునే క్రమంలో మండలానికి ఇద్దరిని నియమించుకున్నాము.. ఆ పది రోజులు మా తిండి ఖర్చులు పాతిక వేలు దాటింది.. పదివేలు యజమాన్యం ఇస్తే ఇక 15వేలు నేనుపెట్టుకున్నా.. ఎన్నికలు అయిపోగానే ఆ ఖర్చులకింద నన్ను పర్నీచర్ తీసుకోమని జిల్లా రిపోర్టర్లు చెప్పారు కానీ.. ఎక్కడ మేము తీసుకెళ్తామేమో అని ఇక్కడ పార్టీ పెద్దలు ఆదేశం మేరకు ఒక్క మాట కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే తీసుకెళ్లారు.. మా టీం ఖర్చు కిందనే 15వేల వరకు నేను పెట్టుకోవల్సి వచ్చింది..
ప్రాణాలకు తెగించి.. దాడులకు బెదరకుండా పోలింగ్ రోజు నా విధులు..
‘‘పొద్దునే డీఎల్ ఇంటి వద్దకు వెళ్లు.. మీతో ఒంగోలు శ్రీను, ఓబీ వ్యాన్ , కెమరా మెన్ వస్తారు తీసుకెళ్లు అంటూ ’’ సాక్షి యజమాన్యం నుండి ఆదేశాలు.. ‘‘డీఎల్ ఎక్కడికి వెళ్లితే అక్కడు మీరు వెళ్లాలి.. రిగ్గింగు పాల్పడితే కవరేజ్ చేయండి ’’ అంటూమరో సందేశం.. ఇంకేముంది యజమాన్యం, జిల్లా రిపోర్టర్ల ఆదేశం మేరకు ఆరోజు నాలుగు గంటలకే డీఎల్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాము.. నేను ఓబిలో వ్యాన్ లో ఉంటూనే డీఎల్ షాడోగా ఉండిపోయాయి… ఈ ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా భూమా నాగిరెడ్డి,శోభనాగిరెడ్డి వ్యవహరించేవారు. డీఎల్ కదలికలను ఎప్పటికప్పుడు నాతో శోభక్క తెలుసుకునేది. గుత్తికొట్టాలకు డీఎల్ వెళ్లారు.. పోలింగ్ కేంద్రంలో దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి బిడ్డ ఏజెంట్ గా ఉండటంతో డీఎల్ అరిచి బయటకుపంపించారు.. అక్కడే ఉన్న మాకు గంగాధర్ రెడ్డి ఫోన్ ఛేశారు.. మా బిడ్డను డీఎల్ బయటకు పంపించారు.. నీవు అక్కడే ఉన్నావు కదా కూర్చోబెట్టమని చెప్పారు.
. డీఎల్ వెళ్లాక మేము గంగాధర్ బిడ్డను ఏజెంట్ కూర్చోబెట్టగలిగాం.. ఆతర్వాత డీఎల్ నందిపాడు వెళ్లారు.. అక్కడ గంగాధర్రెడ్డి భార్య, వాసు భార్య ఏజెంట్ గా కూర్చోని ఉండటం వాళ్లతో పెద్ద డిస్కస్ జరిగింది.. అక్కడే ఉన్న మమ్మల్ని చూసి ఫ్యాంట్ జిప్పు మీద చేయి పెట్టి ఇది కూడా తీసుకోండంటూ డీఎల్ ఆగ్రహించారు.. తర్వాత ఖాజీపేట మీదుగా కమలాపురం డీఎల్ వెళ్లారు.. డీఎల్ కమలాపురం వెళ్లే సమయంలో డెస్క్కు సమాచారం అందించా.. ‘‘మీరు వెనక్కి వచ్చి మైదుకూరు నియోజకవర్గం చూసుకోండి.. డీఎల్ రాగానే వారికి షాడోగా ఉండండి’’ అని చెప్పారు.. మేము ఖాజీపేటకు తిరిగి వచ్చాము..
ఖాజీపేట కేసీ బంగ్లా పోలింగ్ కేంద్రంలో డీఎల్ అల్లుడు కిరణ్తో వాగ్వివాదం..
ఖాజీపేట కేసీ బంగ్లా పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారం మేరకు నేను, శ్రీను వచ్చాము.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా డీఎల్ అల్లుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుగా వస్తుంటే.. తెలిసిన వ్యక్తికదా ఎందుకు ఎదురు పడటం అనే భావనతోముఖంతిప్పుకున్నా.. గమనించిన కిరణ్ పోలింగ్ కు నాకు ఎన్నికల కమీషన్ పాస్ ఇచ్చిన విషయం తెలియక అది గమనించిన కిరణ్ నన్ను పోలీసులకు పట్టించే నిమిత్తం డీఎస్పీ అధికారిని తీసుకువచ్చారు.. నేను ఇక ఎదురు తిరగాల్సి వచ్చింది.. ఎన్నికల కమీషన్ ఇచ్చిన పోలింగ్ పాస్ ను చూపించా..అప్పుడు కిరణ్ తో నాకు గొడవతో కూడిన వాగ్వివాదం జరిగింది.. ఇది సాక్షిటీవీలో లైవ్ కూడా వచ్చింది.. చివరకు అదే డీఎస్పీ తో కిరణ్ ను పోలింగ్ కేంద్రం నుండి నేనే బయటకు పంపించా.. అది ఆ పోలింగ్ కేంద్రంలో జరిగింది..
ఖాజీపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంకు వైఎస్ జగన్..
పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలించే క్రమంలో సాయంత్రం 3.30 గంటల సమయంలో ఖాజీపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్దకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి వచ్చారు.. ఆ సమయంలో డీఎల్ పెద్ద కుమార్తె నిర్మలతో ‘‘ ఏమ్మా నిర్మలమ్మ దౌర్జన్యం చేస్తున్నారు ’’ అంటూ వైఎస్ జగన్అనే క్రమంలో.. ‘‘మీరు రౌడి, దౌర్జన్యం చేసేది మీరు.. మీగురించి మాకు తెలియదా’’ అని నిర్మలమ్మ అనేశారు. జగన్ ఖాజీపేటకు విచ్చేసిన సమాచారం నిర్మలమ్మ తన తండ్రి డీఎల్ కు అందించారు.. నేను వస్తున్నా అని డీఎల్ కు చెప్పిన సమాచారం అక్కడ అప్పటికే తెలిసిపోయింది..
కేసీ కెనాల్ బంగ్లా పోలింగ్ కేంద్రంలో జగన్..
ఖాజీపేట జడ్పీహైస్కూల్ తర్వాత కేసీ కెనాల్ బంగ్లా పోలింగ్ కేంద్రంకు జగన్ విచ్చేశారు.. అప్పటికీ డీఎల్ ఖాజీపేటకు వస్తున్న సమాచారం వైసీపీ లీడర్లకు తెలిసిపోయింది.. డీఎల్ వస్తున్నారు.. ఈ చివరి గంట రిగ్గింగ్ కుపాల్పడతారు మీరు ఇక్కడే ఉండండి అంటూ ఖాజీపేట మండల వైసీపీ నాయకులు, శెట్టిపల్లెరఘురామిరెడ్డి రెండవ కుమారుడు బాబ్జీ లు జగన్ ను కోరారు.. నేను కడప వెళ్లాలి అంటూ జగన్ వెళ్లిపోయారు. జగన్ వెళ్లే క్రమంలో ఐన్యూస్ రిపోర్టర్లు ఎన్నికల తీరు గురించి అడిగారు .. డీఎల్ ఖాజీపేటకు వస్తున్నారు.. రిగ్గింగ్ కుపాల్పడబోతారు.. చూడండి అంటూ పోలింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు..
డీఎల్ ఖాజీపేటకు రాకతో ఉడాయించిన వైసీపీ లీడర్లు..
ఖాజీపేటకు డీఎల్ వచ్చిరాకమునుపే అప్పటి వరకు ఖాజీపేట మండల పోలింగ్ ఇన్చార్జులగా వ్యవహరించిన నాయకులంతా సెల్ ఫోెన్లు ఆప్ చేసి కనపడకుండా పోయారు.. ఖాజీపేట లోని పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ గా ఉన్న గంగాధర్ రెడ్డి మాత్రమే మాకు అందుబాటులో ఉంటూ సమాచారం అందిస్తూ వచ్చారు.. ‘‘ డీఎల్ వచ్చాడు.. మీ సాక్షి వాళ్లే చూసుకోండి’’ అంటూ ఇన్చార్జ్ లు ఫోన్లును స్విచ్చాఫ్ చేసుకున్నారు.. ఇకమిగిలింది నేను, సాక్షి టీవీ శ్రీను. ‘‘ నాగశివా నీవు జాగ్రత్త’’ అక్కడ గలాటాలు మొదలయ్యాయి అంటూ భూమా శోభక్కనాకు ఫోన్ చేసి జాగ్రత్త చెప్పింది. అప్పటికే సాక్షి యజమాన్యం డీఎల్ రిగ్గింగ్ ను అరికట్టే క్రమంలో ఓబీవ్యాన్లును పంపించేపని చేపట్టింది.. ప్రొద్దుటూరు నుండి వస్తున్న ఓబీ వ్యాన్ పై అప్పటికే ఖాజీపేట సమీపంలో దాడి జరిగింది..
ఇక్కడ ఓబీ వ్యాన్ ను ధ్వంసం చేశారు.. ఇక మీరే చూసుకోండంటూ సాక్షి పెద్ద రిపోర్టర్ల నుండి మాకు సూచనలు.. సుంకేసుల పోలింగ్ కేంద్రం వద్దకు డీఎల్ వస్తున్నారు.. రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో నేను, శ్రీను అక్కడి వెళ్లాము.. శీను సుంకేసుల పోలింగ్ కేంద్రం నుండి లైవ్ ఇస్తున్నారు.. నేను అక్కడే ఉన్నా.. సుంకేసుల వస్తున్న డీఎల్ దుగ్గిరెడ్డి జనార్థన్ రెడ్డి ఇంటి మీదకు వెళ్తున్నారు అనే సమాచారం వచ్చింది.. అప్పుడే నాకు కడప సాక్షి ఆఫీసు నుండి ఫోన్.. నీవు అక్కడి నుండి జనార్ధన్ ఇంటి మీదకు డీఎల్ వెళ్తున్నారంట మీరు వెంటనే వెళ్లండి అని.. నేను అక్కడ నుండి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నక్రమంలో పోలీసు జీపు,అందులో జర్నలిస్టు మిత్రులు కొందరున్నారు.. నేను వారితోకలసి వెళ్లి సాక్షి టీవీ చంద్రకు ఫోన్ చేసి వారి వాహనంలో ఎక్కాను.. ఖాజీపేట నుండి కేసీ బంగ్లా వైపు డీఎల్ వెళ్తున్నారు.. మేము ఫాలో అయ్యాము.. మా వాహనం పసిగట్టిన డీఎల్ అనుచరులు ఢీకొట్టారు.. ఈ కార్ల మధ్య మనం చిక్కిపోతామనే భావనతో మేము డైరెక్టుగా దుంపలగట్టు వైపు వెళ్లాము..
నన్ను హతమార్చేందుకు వచ్చి ఓబీ వ్యాన్ ధ్వంసం..
ఇక పోలింగ్ 20 నిమిషాల్లో ముగియనున్న ఓబీవ్యాన్ పోలీంగ్ కేంద్రం వద్ద ఉంది.. నేను శ్రీనుతో మాట్లాడా.. శీను ఇక్కడ మా కారును ఢీ కొట్టే ప్రయత్నంచేశారు.. తప్పించుకున్నాం అని చెప్పా.. అన్న నీవు జాగ్రత్త నీ కోసం డీఎల్ వస్తున్నాడు అని ఫోన్ పెట్టి ఈ విషయం గురించి లైవ్ ఇస్తున్నా అని చెప్పారు.. శీను లైవ్ ఇస్తున్న క్రమంలో డీఎల్ అక్కడికి రానే వచ్చారు.. నేను ఓబీ వ్యాన్లో ఉన్నారనుకున్నారు.. డీఎల్ అనుచరుల ఇచ్చినసమాచారంతో డీఎల్ మేనల్లుడు మధు, అల్లుడు కిరణ్లు డ్రైవర్గా ఉన్నముదిరెడ్డిపల్లె శ్రీనుతో చెప్పి ఓబీ వ్యాన్ ను ఢీ కొట్టు అందులో నాగశివా ఉన్నాడు అని చెప్పించి ఢీకొట్టించారు.. అందులో వెతికారు నేను లేను.. వ్యాన్ను ధ్వంసం చేయడంతో పాటు సాక్షి శ్రీనుపై భయంకరమైన దాడికి పాల్పడ్డారు.. కానిస్టేబుల్ శివరామిరెడ్డి వాళ్ల శ్రీనునుకాపాడి మైదుకూరు పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు..
‘‘నిన్ను చంపేందుకు వచ్చారు.. పారిఫో’’ అంటూ ఈనాడు భాస్కర్, జ్యోతి ప్రసాద్ ఫోన్..
నన్ను హతమార్చే క్రమంలో ఓబీ వ్యాన్పై దాడి చేసిన తర్వాత నేను లేకపోవడంలో ఇక్కడే ఎక్కడో ఉంటాడు వాడిని పట్టుకోండి అంటూ సుంకేసులతో డీఎల్ అనుచరులు హాల్చల్ చేశారు.. డీఎల్ సుంకేసుల విచ్చేసిన నేపథ్యంలో మిత్రులు ఈనాడు భాస్కర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ప్రసాద్ అక్కడికి వచ్చారు.. ‘‘ నాగశివను ఇక్కడ ఉండకుండా వెళ్లిపోమని చెప్పండి.. వాడి కోసం కొందరు వెళ్లారు..దొరికితే చంపేస్తారు ..మీరు చెప్పండి అంటూ ’’ మధుచెప్పాడని నాకుఫోన్ చేసి భాస్కర్,ప్రసాద్ లు చెప్పారు.. అప్పటికే నేను చెన్నూరు చేరుకున్నాను.. సాక్షి విలేకరి బాలకొండయ్య ఇంట్లో ఉన్నానని చెప్పా.. అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా కడప సాక్షి ఆఫీసుకు వెళ్లి పోలింగ్ వార్తలు రాచి ఇచ్చా..రాత్రి పదకొండుకు ఇంటికి చేరుకున్నాను..
ఓబీ వ్యాన్ ధ్వంసం చేసినా డీఎల్ పై కేసు పెట్టలేదు..
సుంకేసుల పోలింగ్ కేంద్రం వద్ద ఓబీ వ్యాన్ ధ్వంసం చేయబడినా.. సాక్షి శీను మీద దాడి చేసినా కనీసం డీఎల్ పై పోలీాసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం సాక్షి యజమాన్యం చేయలేకపోయింది.. మాకేందుకు అన్నట్లు అందరూ మిన్నకుండిపోయారు.. శ్రీనుగాయపడి మైదుకూరుపోలీసు స్టేషన్ లో ఉన్నవిషయం సాక్క్షి యజమాన్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికిరావడంతో ఫోన్ లో పరామర్శించారు.. నన్ను ఓ చిన్నవిలేకరినే కదా.. నన్ను వదిలేశారు వైసీపీ నాయకులతోపాటు, సాక్షి యజమాన్యం .. అందుకేనేమో నేను సాహసం.. నేను పడ్డ వేదన..ప్రాణాలకు తెగించి పోరాడిన విధానం జగన్ దృష్టికి వెళ్ల నట్లు ఉందో..లేదో మరి… బిడ్డ కన్నీటిని ఖాతరుచేయకుండా అంత శ్రమ పడినా యజమాన్యం నుండే కాదు.. వైసీపీ పెద్ద లీడర్ల నుండి ధ్యాంక్స్ చెప్పిన దాఖలాలు లేవు.. ఇదేనేమో మన ప్రాణాలకు లెక్క కట్టే విలువ…గుర్తింపు..
ఇప్పుడు ఆ నేతలు తొడలు చరుస్తున్నారు..
జగన్ ఉప ఎన్నికలు ఏంతకీలకం ఆ సమయంలో ముఖంచాటేసిన.. పలాయనంచిత్తగించిన నేతలు ఇప్పుడు మాత్రం మాజగన్ సన్నిహితుడంటూ తొడలు చరుస్తున్నారు.. జగన్ కే వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు ఇప్పుడు అధికారం మత్తులో జోగుతున్నారు., మాదే రాజ్యం అంటూ పదవులు సొంతం చేసుకుంటున్నారు.. కొందరైతే జగన్ అంటే నేను.. నేనంటే జగన్ అంటూ సూక్తిలు చెబుతున్నారు.. ఇదండి రాజకీయ లోకం..