మైదుకూరులోని సాయిబాబా దేవాలయం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ కమిటీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. గురుపౌర్ణమి సందర్భంగా మైదుకూరు సాయినాధుడి ఆలయం ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సాయినాధుడి పాద పూజ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మైదుకూరులోని కడప రోడ్డు పెద్దా సాయిబాబా గుడి ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది.. తెల్లవారుజూమునుండి సాయినాధుడిని దర్శించకున్నారు. భక్తులు అధికసంఖ్యలో సాయినాధుడి దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆప్రాంతం అంతా భక్తుల సందడితో కోలాహలంగా ఉండిపోయింది.